ఇక ‘లాలాజలం’తో కొవిడ్ టెస్టులు!
లాలాజలంతో కొవిడ్ నిర్ధారణ జరిపే నూతన విధానానికి అమెరికా ఎఫ్డీఏ అనుమతినిచ్చింది. ఈ నూతన పద్ధతి ద్వారా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం భారీగా పెంచవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘సలైవాడైరెక్ట్’ విధానానికి FDA అనుమతి
మరింత సులభతరం కానున్న కొవిడ్ నిర్ధారణ
కొవిడ్ టెస్టుల్లో ‘గేమ్ ఛేంజర్’ అంటున్న నిపుణులు
హూస్టన్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని వీలైనంత త్వరగా గుర్తించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. వేగంగా, కచ్చితత్వంతో కూడిన వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగా తాజాగా లాలాజలంతో కొవిడ్ నిర్ధారణ జరిపే నూతన విధానానికి అమెరికా ఎఫ్డీఏ అనుమతినిచ్చింది. ఈ నూతన పద్ధతి ద్వారా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం భారీగా పెంచడంతోపాటు కొవిడ్ టెస్టు ఖర్చు కూడా తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం ప్రపంచవ్యాప్తంగా గొంతు, ముక్కు ద్వారా నమూనాలు(స్వాబ్) సేకరిస్తున్నారు. ఇవి సేకరించే వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి రావడం, నమూనాలు భద్రపరచడం, ఫలితానికి సమయం, ఖర్చు వంటి సవాళ్లు ఎదురౌతున్నాయి. అంతేకాకుండా శాంపిళ్ల సేకరణ కూడా అత్యంత జాగ్రత్తగా తీసుకోవడం మరో కీలకాంశం. వీటిని అధిగమించే నూతన విధానానికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కృషి జరుగుతోంది. తాజాగా ఎఫ్డీఏ ఆమోదించిన సలైవా టెస్ట్ పద్ధతిలో నోటినుంచి లాలాజలాన్ని తీసుకొని పరీక్షిస్తారు. ఈ విధానం వల్ల కొవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరగడంతోపాటు పరీక్షల్లో కీలకమైన రియేజెంట్ల లోటును భర్తీ చేయవచ్చని ఎఫ్డీఏ కమిషనర్ స్టీఫెన్ హాన్ స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే లాలాజలంతో పరీక్షించే నాలుగు రకాల పద్ధతులకు ఎఫ్డీఏ అనుమతినిచ్చింది. అయితే వాటి ఫలితాల్లో తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ‘సలైవాడెరెక్ట్’ పేరుతో యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిపుణులు అభివృద్ధి చేసిన ఈ విధానంతో స్వాబ్ పరీక్షలకు సమాన ఫలితాలు ఉన్నట్లు గుర్తించామని ఎఫ్డీఏ పేర్కొంది. అత్యవసర వినియోగంలో భాగంగా ఈ నూతన పద్ధతికి అనుమతి ఇస్తున్నట్లు ఎఫ్డీఏ ప్రకటించింది. వచ్చే కొన్ని వారాల్లోనే దేశవ్యాప్తంగా ఈ పరీక్షలను అందుబాటులోకి తీసుకొస్తామని పరిశోధకులు పేర్కొన్నారు. స్వాబ్ ద్వారా తీసుకొనే నమూనాల కంటే ఈ నూతన పద్ధతిలో తక్కువ హాని ఉంటుందని, దాదాపు 90శాతం కచ్చితమైన ఫలితం వస్తున్నట్లు నిపుణులు తెలిపారు.
అత్యంత తేలికగా నమూనాలు సేకరించి, పరీక్షించే ఈ విధానం రానున్న రోజుల్లో కొవిడ్-19 వైరస్ నిర్ధారణలో ‘గేమ్ ఛేంజర్’గా మారే అవకాశాలున్నాయని సలైవాడెరెక్ట్ అభివృద్ధిలో భాగమైన పరిశోధకులు నాధాన్ గ్రూబౌగ్, అన్నే వైల్లీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి అయ్యే ఖర్చు కూడా మిగతా పద్ధతులతో పోల్చితే చాలా తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమెరికా ఎఫ్డీఏ ఆమోదించిన ఈ నూతన విధానాన్ని అంతర్జాతీయ ఆరోగ్యరంగ నిపుణులు స్వాగతిస్తున్నారు.
ఎన్నో ప్రయోజనాలు..
*శాంపిల్ తీసుకోవడం సురక్షితం, తక్కువ హాని..
*ఆరోగ్య సిబ్బందికి స్పల్ప శిక్షణ, శాంపిల్ సేకరించే సమయంలో తక్కువ ప్రమాదం
*ముక్కు, గొంతు నుంచి నమూనాలు సేకరించే సమయంలో తుమ్ము, దగ్గు వలన వైరస్ మరింత బయటకు వస్తుంది. దీనిలో అలాంటి అవకాశాలు లేకపోవడం
*అనుమానిత వ్యక్తులే సొంతంగా శాంపిల్ సేకరించి ఇవ్వడం
*కనిష్ఠ ఉష్ణోగ్రతలలో శాంపిళ్లను ప్రత్యేకంగా భద్రతపరిచే అవసరం లేకపోవడం
* స్వాబ్ పద్ధతితో పోల్చితే తక్కువ ఖర్చు, దాదాపు 90శాతం కచ్చితమైన ఫలితం ఉండటం
ఇదిలా ఉంటే, కొవిడ్-19ను నిర్ధారించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం స్వాబ్ పద్ధతినే అవలంభిస్తున్నారు. భారత్ వంటి దేశాల్లో ఆర్టీ-పీసీఆర్తోపాటు ట్రూనాట్, సీబీనాట్ విధానాల ద్వారా కూడా కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్టటైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్