దిల్లీ అసెంబ్లీకి ఆగ్రహం తెప్పించిన ఫేస్బుక్
దేశ రాజధానిలో జరిగిన అల్లర్ల ఘటనకు సంబంధించిన విచారణలో భాగంగా దిల్లీ అసెంబ్లీకి చెందిన ‘శాంతి, సామరస్య’ కమిటీ ముందు హాజరుకాకుండా ఫేస్బుక్ అధికారులు దాటవేసి, ఆగ్రహానికి గురయ్యారు.
దిల్లీ: దేశ రాజధానిలో జరిగిన అల్లర్ల ఘటనకు సంబంధించిన విచారణలో భాగంగా దిల్లీ అసెంబ్లీకి చెందిన ‘శాంతి, సామరస్య’ కమిటీ ముందు హాజరుకాకుండా ఫేస్బుక్ అధికారులు దాటవేసి, ఆగ్రహానికి గురయ్యారు. తాము ఇప్పటికే పార్లమెంటరీ ప్యానెల్ ఎదుట హాజరయ్యామని, ఈ అంశం కేంద్రం పరిధిలోనిదంటూ ఇచ్చిన సమాధానం కమిటీని నివ్వెరపరిచింది. కాగా, ఈ వ్యవహారంపై తాము సామాజిక మాధ్యమ సంస్థకు తుది హెచ్చరిక జారీ చేస్తున్నామని వెల్లడించింది. విద్వేషపూరిత, అభ్యంతరకర పోస్టుల విషయంలో ఫేస్బుక్ చూసీ చూడనట్లు వదిలేస్తోందంటూ దిల్లీ అసెంబ్లీ ఇటీవల ఫేస్బుక్కు సమన్లు జారీచేసింది. ఈ విచారణ కమిటీకి ఎమ్మెల్యే రాఘవ్ చద్దా నేతృత్వం వహిస్తున్నారు.
దీనికి సంబంధించి ఫేస్బుక్ ఇండియా కమిటీకి రాతపూర్వక సమాధానం ఇచ్చింది. ‘ఈ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది. ఇప్పటికే మేము పార్లమెంట్ కమిటీ ముందు హాజరయ్యాం. మీరు పంపిన నోటీసులను వ్యతిరేకిస్తున్నాం. వాటిని వెనక్కి తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాం’ అని పేర్కొంది. ఫేస్బుక్ స్పందనను కమిటీ తీవ్రంగా పరిగణించింది. సభ్యులు దాన్ని అవమానకరంగా, ధిక్కరణగా భావించారు. ‘ఇది దిల్లీకి సంబంధించిన విషయం. ఈ అంశం కమిటీ పరిధిలోనిది కాదని ఫేస్బుక్ ఎలా చెప్పగలదు. సంస్థ ప్రకటన ఆమోదయోగ్యం కాదు. పార్లమెంట్కు సంబంధం లేకుండా రాష్ట్ర అసెంబ్లీ స్వతంత్రంగా పనిచేస్తుంది. దిల్లీ అల్లర్ల ఘటనలో మీ పాత్రను బయటపడకుండా దాచేందుకే మీరు హాజరుకాలేదు’ అని కమిటీ మండిపడింది. అలాగే సంస్థ దురదృష్టకరమైన, అస్పష్టమైన, దాటవేసే సమాధానం ఇచ్చిందని కమిటీ సభ్యుడు ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఘవ్ మాట్లాడుతూ..కొత్తగా మరోసారి సమన్లు పంపే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఈసారి కూడా హాజరుకాకపోతే బలవంతంగా రప్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈశాన్య దిల్లీలో మత కలహాలు చోటుచేసుకోగా ఆ అల్లర్లలో 53 మంది మరణించారు. 400 మంది గాయపడ్డారు. అయితే ఆ కలహాలను తీవ్రతరం చేసేలా ఫేస్బుక్ సహకరించిందని, విద్వేష పూరిత ప్రసంగాలను చూసీచూడనట్లు వదిలేసిందని ఆగస్టు 31న జరిగిన విచారణలో కమిటీ తేల్చింది. ఈ క్రమంలో అందిన ఫిర్యాదుల ఆధారంగా, విచారణ చేపట్టి ఫేస్బుక్ ఉపాధ్యక్షుడికి సమన్లు జారీచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్