సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్‌లో కాల్పుల కలకలం

దేశ రాజధాని దిల్లీలో సీఆర్‌పీఎఫ్‌ 122వ బెటాలియన్‌లో కాల్పుల కలకలం రేగింది. సీఆర్‌పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తన  పైఅధికారిని కాల్చి చంపి తాను..

Published : 25 Jul 2020 11:08 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో సీఆర్‌పీఎఫ్‌ 122వ బెటాలియన్‌లో కాల్పుల కలకలం రేగింది. సీఆర్‌పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తన  పైఅధికారిని కాల్చి చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. లోధి ఎస్టేట్‌ ప్రాంతంలోని కేంద్ర హోంశాఖ భవనంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి అనంతరం కాల్పులకు దారితీసినట్టు అధికారులు తెలిపారు. సర్వీసు తుపాకీతోనే ఎస్‌ఐ తన పైఅధికారిపై కాల్పులు జరిపారు. ఈఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని