జమ్మూకశ్మీర్లో నలుగురు ముష్కరుల హతం
జమ్మూకశ్మీర్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు నలుగురు ముష్కరులను మట్టుపెట్టాయి. ఒక ట్రక్కులో శ్రీనగర్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకొని...
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు నలుగురు ముష్కరులను మట్టుపెట్టాయి. ఒక ట్రక్కులో శ్రీనగర్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకొని హతమార్చాయి. నగ్రోటా ప్రాంతంలోని బాన్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు.
జమ్మూ నుంచి శ్రీనగర్ వైపు వెళ్తున్న ట్రక్కును గురువారం తెల్లవారుజామున నగ్రోటా టోల్ ప్లాజా వద్ద తనిఖీ నిమిత్తం ఆపగా.. అందులోని ముష్కరులు ఆటోమెటిక్ ఆయుధాలతో భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారని పోలీసులు తెలిపారు. వెంటనే స్పందించిన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరపడంతో ఆ ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని జమ్ము ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ట్విటర్లో వెల్లడించారు.
ఈ ఘటనలో గాయపడ్డ ఒక పోలీస్ కానిస్టేబుల్ను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఉదయం జరిగిన ఘటనతో బలగాలు భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. ఈ ఏడాదిలో ఈ తరహాలో జరిగిన రెండో ఆపరేషన్ ఇది. జనవరి 31న కశ్మీర్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించి ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!