ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంటర్నెట్ ఉచితం
ఆ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులకు ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం
హరిద్వార్: దేశంలోనే తొలిసారిగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులకు ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ పథకాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ దోయివాలా పట్టణంలోని షహీద్ దుర్గామల్ ప్రభుత్వ పీజీ కళాశాలలో ప్రారంభించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలలుగన్న డిజిటల్ ఇండియా సాధన దిశగా ఈ చర్యను ఆయన అభివర్ణించారు.
అన్ని ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు అత్యంత వేగవంతమైన, ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచినందుకు ఆయన అభినందనలు తెలిపారు. కాగా, ఈ ఉచిత ఇంటర్నెట్ సదుపాయం రాష్ట్ర విద్యావిధానంలో మంచి ఒరవడికి నాంది కాగలదని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం