ఇప్పుడు చెప్తున్నా.. ఇక నేను భాజపాతోనే ఉంటా
ముంబయిలో శివసేన కార్యకర్తల చేతిలో దాడికి గురైన నేవీ మాజీ అధికారి మదన్ శర్మ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తాను భాజపా, ఆర్ఎస్ఎస్లతో ఉంటానని అన్నారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ముంబయి: ముంబయిలో శివసేన కార్యకర్తల చేతిలో దాడికి గురైన నేవీ మాజీ అధికారి మదన్ శర్మ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తాను భాజపా, ఆర్ఎస్ఎస్లతో ఉంటానని అన్నారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘శివసేన కార్యకర్తలు నాపై దాడి చేసేటప్పుడు నేను భాజపా, ఆర్ఎస్ఎస్ మద్దతుదారుడినని ఆరోపణలు చేశారు. ఇప్పుడు చెబుతున్నా నేను ఇక నుంచి భాజపా, ఆర్ఎస్ఎస్లతో ఉంటా. నాపై జరిగిన దాడి గురించి గవర్నర్కు వివరించా. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరా’ అని మదన్ శర్మ తెలిపారు.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ఠాక్రేను ఎగతాళి చేసే విధంగా ఉన్న ఫొటోను వాట్సాప్లో పంపినందుకు నేవీ మాజీ అధికారి మదన్పై పలువురు శివసేన కార్యకర్తలు దాడికి దిగిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి వెంటనే బెయిల్పై విడుదల చేశారు. వారి విడుదలను ఖండిస్తూ.. ఆయన కుటుంబీకులు అదనపు కమిషనర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఘటనపై స్పందించిన కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్.. మాజీ సైనికులపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..