గులాంనబీ ఆజాద్‌కు కరోనా

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌ కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్‌ మహమ్మారి సోకినట్టు ఆయన ట్విటర్‌లో .......

Updated : 16 Oct 2020 17:00 IST

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్‌ కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్‌ మహమ్మారి సోకినట్టు ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వ్యక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా మరో 63వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, ప్రహ్లాద్‌ పటేల్‌ తదితరులతో పాటు పలు రాజకీయ పార్టీల ప్రముఖులు సైతం కొవిడ్‌ బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని