అమిత్షాకు నెగిటివ్పై హోంశాఖ క్లారిటీ
కేంద్ర హోంమంత్రి అమిత్షాకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వార్తను హోంశాఖ వర్గాలు తోసిపుచ్చాయి. ఆయనకు ఎలాంటి కరోనా పరీక్షలూ నిర్వహించలేదని ఆ శాఖకు చెందిన అధికారి తెలిపారు. ఒకవేళ పరీక్షలు నిర్వహించినట్లయితే తామే ఆ వివరాలు.......
దిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్షాకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వార్తను హోంశాఖ వర్గాలు తోసిపుచ్చాయి. ఆయనకు ఎలాంటి కరోనా పరీక్షలూ నిర్వహించలేదని ఆ శాఖకు చెందిన అధికారి తెలిపారు. ఒకవేళ పరీక్షలు నిర్వహించినట్లయితే తామే ఆ వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి అసత్యాలూ ప్రచారం చేయొద్దని సూచించారు.
ఈ నెల 2న అమిత్ షా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు గురుగ్రాంలోని ఓ ఆస్పత్రిలో చేరారు. అయితే, తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చిందంటూ ఆ పార్టీ ఎంపీ మనోజ్ తివారీ ట్వీట్ చేశారు. హోంశాఖ అధికారుల వివరణతో ఆయన తన ట్వీట్ను డిలీట్ చేయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!