చిల్ డొనాల్డ్, చిల్!’
అధ్యక్ష ఎన్నికల లెక్కింపులో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని ఉడుక్కుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఓ టీనేజర్ గట్టి కౌంటర్ ఇచ్చింది.
11 నెలల క్రితం విమర్శను ఇప్పుడు తిప్పికొట్టింది
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల లెక్కింపులో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని ఉడుక్కుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఓ టీనేజర్ గట్టి కౌంటర్ ఇచ్చింది. 11 నెలల క్రితం ట్రంప్ అన్నమాటను ఆయనకే అప్పజెప్పింది. ఆమే స్వీడన్కు చెందిన పర్యావరణ పరిరక్షణ కార్యకర్త, 17 ఏళ్ల బాలిక గ్రేటా థన్బర్గ్. ఇంతకీ విషయం ఏంటంటే..
వాతావరణ మార్పుల కారణంగా మానవాళి తన అస్తిత్వానికే ప్రమాదం కొని తెచ్చుకుంటుందంటూ సూటిగా తన అభిప్రాయాలను వెల్లడిచేసే గ్రేటా థన్బర్గ్..2019లో టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైంది. అయితే, ఆ ఎంపికను అవమానిస్తూ అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ‘చాలా హాస్యాస్పదంగా ఉంది. గ్రేటా తన కోపాన్ని నియంత్రించుకునేందుకు తప్పక ప్రయత్నం చేయాలి. ఆ తరవాత స్నేహితులతో కలిసి ఓ పాత సినిమాకు వెళ్లండి! చిల్ గ్రేటా, చిల్!’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా ఇప్పుడు ఓట్ల లెక్కింపు విధానంపై ట్రంప్ వైఖరిని ఎండగడుతూ, ఆయన అన్నట్టుగానే సమాధానమిచ్చింది గ్రేటా. ‘ఓట్ల లెక్కింపు ఆపండి’ అంటూ ట్రంప్ చేసిన ట్వీట్కు బదులిస్తూ..‘ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. డొనాల్డ్ తన కోపాన్ని నియంత్రించుకునేందుకు తప్పక ప్రయత్నం చేయాలి. ఆ తరవాత స్నేహితులతో కలిసి ఓ పాత సినిమాకు వెళ్లండి! చిల్ డొనాల్డ్, చిల్!’ అంటూ ఆయన ఆరోపణలను ఖండించింది. ఆ ట్వీట్ వెంటనే నెట్టింట్లో వైరల్గా మారడంతో పాటు, నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.
కాగా, పర్యావరణ మార్పులపై చేస్తోన్న పోరాటంలో అమెరికా అత్యంత కీలకమని భావించిన ఆ టీనేజర్..కొద్ది నెలల క్రితం డెమొక్రాటిక్ అభ్యర్థి జోబైడెన్కు తన మద్దతు ప్రకటించారు. పర్యావరణ మార్పులపై పోరాటం చేస్తోన్న ఆమె..దాని పరిరక్షణ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ గతంలో పలు అంతర్జాతీయ వేదికలపై దేశాధినేతలను నిలదీశారు. ఇదిలా ఉండగా..అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠ ఇంకా వీడకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!