అర్ణబ్‌కు బాంబే హైకోర్టులో చుక్కెదురు

రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్ణబ్‌ గోస్వామికి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. 2018లో ఓ ఇంటీరియర్‌ డిజైనర్, అతని తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలపై అరెస్టయిన అర్ణబ్‌ దాఖలు బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం ..........

Updated : 09 Nov 2020 16:18 IST

ముంబయి: రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్ణబ్‌ గోస్వామికి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. 2018లో ఓ ఇంటీరియర్‌ డిజైనర్, అతని తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలపై అరెస్టయిన అర్ణబ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో అర్ణబ్‌తో పాటు మరో ఇద్దరిని అలీబాగ్‌ పోలీసులు నవంబర్‌ 4న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తమ అరెస్టు అక్రమమని పేర్కొంటూ అర్ణబ్‌ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నా శుక్రవారం ఆయనకు బెయిల్‌ లభించలేదు. మధ్యంతర బెయిల్‌పై శనివారం వాదనలు విన్న న్యాయస్థానం ఈ అంశంపై తీర్పును రిజర్వు చేసింది. తాజాగా విచారించిన బాంబే  హైకోర్టు ధర్మాసనం ఈ కేసులో బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే, బెయిల్‌ కోసం దిగువ కోర్టులో దరఖాస్తు చేసుకొనే వెసులుబాటును కల్పించడంతో ఆయన అలీబాగ్‌లోని సెషన్స్‌ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు. ఆయన బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం లోపు విచారణ జరపాలని బాంబే హైకోర్టు సెషన్స్‌ కోర్టును ఆదేశించింది. అర్ణబ్‌ను తొలుత జైలు క్వారంటైన్‌ సెంటర్‌లో ఉంచారు. జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న అర్ణబ్‌ మొబైల్‌ ఫోన్‌ వాడుతున్నట్లు సమాచారం రావడంతో ఆదివారం ఆయన్ను తలోజా జైలుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని