ఆ రెండుమాత్రలు కలిపివాడితే ప్రమాదమేనా?
చికిత్సలో భాగంగా హైడ్రాక్సీక్లోరోక్విన్తోపాటు అజిత్రోమైసిన్ మాత్రలను(HCQ+AZM) ఒకేసారి వాడడం వల్ల హృద్రోగ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
HCQ, అజిత్రోమైసిన్ కలిపి వాడటంపై తాజా నివేదికలు
స్వల్పకాలిక కోర్సుతో ప్రమాదం లేదంటున్న నిపుణలు
వాషింగ్టన్: కరోనా చికిత్సలో భాగంగా హైడ్రాక్సీక్లోరోక్విన్తోపాటు అజిత్రోమైసిన్ మాత్రలను(HCQ+AZM) ఒకేసారి వాడడం వల్ల హృద్రోగ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఒక్కోసారి వీటివల్ల ప్రాణాలకే ప్రమాదం పొంచివుందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే స్వల్పకాలిక కోర్సులో భాగంగా HCQ ముప్పై రోజుల పాటు వాడితే మాత్రం ఎలాంటి ప్రమాదం లేదని, దీర్ఘకాలికంగా వాడితేనే హృద్రోగ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. దీర్ఘకాలికంగా HCQ వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి గత ఏప్రిల్లోనే యూరోపియన్ మెడిసిన్స్ ఏజన్సీ(ఈఎంఏ) కూడా హెచ్చరించింది. మరింత పరిశోధనలు జరిపిన అనంతరం మరో నివేదిక దీన్ని స్పష్టం చేసింది. తాజాగా ఈ పరిశోధన నివేదిక ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ రూమటాలజీ, MedRxivలలోనూ ప్రచురితమైంది.
కరోనావైరస్ విజృంభిస్తోన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా మలేరియాకు ఉపయోగించే HCQ నియంత్రిస్తోన్నట్లు నిపుణులు అంచనా వేశారు. దీంతో HCQ వాడకం పెరిగింది. దీనిపై విస్తృత పరిశోధనలు జరగాల్సి ఉందని అంతర్జాతీయ నిపుణులు ఇప్పటికే సూచించారు. ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, ముప్పై రోజుల స్వల్పకాలిక కోర్సు వల్ల ప్రమాదమేమీ లేదని తేలింది. కానీ వీటిని దీర్ఘకాలికంగా అజిత్రోమైసిన్తో కలిపి వాడితేనే ప్రమాదమని పరిశోధన పత్రాన్ని రూపొందించిన డానియల్ ప్రైటో అల్హాంబ్రా వెల్లడించారు. గడిచిన 20 సంవత్సరాలలో HCQ వాడిన దాదాపు 9లక్షల 50వేల మంది సమాచారాన్ని క్రోడీకరించిన అనంతరం దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. జర్మనీ, జపాన్, నెదర్లాండ్స్, స్పెయిన్, యూకే, అమెరికా దేశాలకు చెందిన సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. అయితే దీనికి సంబంధించిన సమాచారంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని ఆరోగ్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కరోనా వైరస్ చికిత్సలో ప్రతిఒక్కరికీ హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడవద్దని తాజాగా అమెరికా అంటువ్యాధుల సొసైటీ(ఐడీఎస్ఏ) కూడా సూచించింది. అంతేకాకుండా వీటికి సంబంధించిన తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇదిలా ఉంటే, కరోనా చికిత్సలో HCQ ఆశించిన ఫలితాలు చూపించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పలుసార్లు అభిప్రాయపడిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని