కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌పై అత్యవసర సమావేశం!

యూకేలో కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ విషయమై చర్చించేందుకు జాయింట్ మానిటరింగ్‌ గ్రూప్‌(జేఎంజీ)ను సోమవారం అత్యవసర సమావేశానికి రమ్మని ఆహ్వానించింది.

Updated : 21 Dec 2020 04:39 IST

దిల్లీ: యూకేలో కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ విషయమై చర్చించేందుకు కొవిడ్‌-19 జాయింట్ మానిటరింగ్‌ గ్రూప్‌(జేఎంజీ)ను సోమవారం అత్యవసర సమావేశానికి పిలిచింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘ఆరోగ్య సేవల డీజీ అధ్యక్షతన జాయింట్‌ మానిటరింగ్‌ గ్రూప్‌(జేఎంజీ) అత్యవసరంగా భేటీ కానుంది. కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ గురించి వారు ఈ సమావేశంలో చర్చించనున్నారు’ అని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మానిటరింగ్(జేఎంజీ) గ్రూప్‌లో డబ్ల్యూహెచ్‌వో భారత ప్రతినిధి రోడరికో ఓఫ్రిన్‌ ఉన్నారు. ఆయన కూడా సోమవారం సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. 

కాగా యూకేలో కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. దీంతో పలు దేశాలు ఆందోళన మొదలైంది. ఇప్పటికే బెల్జియం, నెదర్లాండ్‌ దేశాలు బ్రిటన్‌ విమానాలపై నిషేధాజ్ఞలు విధించాయి. జర్మనీ కూడా అదే నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తోంది. ఈ వైరస్‌ స్ట్రెయిన్‌ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందంటూ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు.  

ఇదీ చదవండి

కొత్తరకం కరోనా స్ట్రెయిన్‌.. పలు దేశాల్లో కలవరం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని