కొండచరియల ఘటన.. 43కు చేరిన మృతులు

కేరళలోని ఇడుక్కి జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మరో 16 మంది మృతదేహాలను..

Published : 10 Aug 2020 01:02 IST

తిరువనంతపురం: కేరళలోని ఇడుక్కి జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో సహాయక సిబ్బంది మరో 17 మంది మృతదేహాలను వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య 43కి చేరింది. ఇప్పటివరకు 12 మందిని కాపాడినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో 30 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం భారీ వర్షాలు కురవడంతో రాజమలాయ్‌ ప్రాంతంలోని 30 నివాసాలున్న తేయాకు తోటల కార్మికుల కాలనీలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటికే 26 మృతదేహాలు బయటపడగా, ఆదివారం మరో 17 శవాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. మిగతావారి కోసం స్నైపర్‌ శునకాలతో గాలిస్తున్నారు. మంత్రి వి.మురళీధరన్‌, ప్రతిపక్ష నేత రమేష్‌ చెన్నితల ఆదివారం ప్రమాద స్థలాన్ని సందర్శించారు.

మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ కేరళలోని పలు జిల్లాలను హెచ్చరించింది. అలప్పళ, ఇడుక్కి, మలప్పురం, కోలికోడ్‌, వయనాడ్‌, కన్నూర్‌, కాసర్‌గోడ్‌ ప్రాంతాల్లో రెడ్‌ అలెర్ట్‌ విధించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌‌కు చెందిన ఆరు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని