వారికి అదే తగిన శిక్ష..!
అత్యాచార కేసుల్లో దోషులను బహిరంగంగా ఉరితీయడమో లేదా పురుషత్వం కోల్పోయేలా(క్యాస్ట్రేషన్) చేయాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ అభిప్రాయపడ్డారు.
రేపిస్టులపై పాకిస్థాన్ ప్రధాని అభిప్రాయం
ఇస్లామాబాద్: అత్యాచార కేసుల్లో దోషులను బహిరంగంగా ఉరితీయడమో లేదా పురుషత్వం కోల్పోయేలా(క్యాస్ట్రేషన్) చేయాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ అభిప్రాయపడ్డారు. వీటిద్వారానే అత్యాచారాలను అరికట్టవచ్చన్నారు. తాజాగా లాహోర్లో జరిగిన అత్యాచార ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
లాహోర్కు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కారులో బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి బయలుదేరిన సమయంలో కారులో ఇంధనం అయిపోవడంతో తన భర్తకు సమాచారం ఇచ్చింది. అతను అక్కడికి చేరుకునేలోపే ఇద్దరు సాయుధ దుండగులు దీనిని గమనించారు. వెంటనే కారు అద్దాలను ధ్వంసం చేసి, తుపాకులతో బెదిరించి వారిని బయటకులాగారు. ఇద్దరు చిన్నారుల ముందే మహిళపై అత్యాచారం చేసి పారిపోయారు. అనంతరం ఆ మహిళ పోలీసుల సాయం కోరినా.. వారుకూడా సరిగా స్పందించలేదని విచారణలో తేలింది. అంతేకాకుండా పురుషుల సాయం లేకుండా రాత్రి సమయంలో బయటకు వెళ్లడం తప్పని బాధిత మహిళనే అక్కడి పోలీసులు తప్పుబట్టారు. పోలీసుల స్పందనపై మరింత కోపోద్రిక్తులైన పాక్ మహిళలు, వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇది దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది.
ఈ సమయంలో ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ ఈ ఘటనపై స్పందించారు. ‘ఇలాంటి నీచమైన అత్యచార ఘటనల్లో నిందితులను బహిరంగంగా ఉరితీయాలి. కానీ, ఈ చర్యలవల్ల మరణశిక్షను వ్యతిరేకిస్తున్న దేశాలతో వాణిజ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే, ఇటువంటి వారికి ఔషధాల సాయంతో పురుషత్వం కోల్పోయేలా(క్యాస్ట్రేషన్) చేయాలని అభిప్రాయపడుతున్నా’ అని స్పష్టంచేశారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ డిగ్రీ శిక్షల్లాగానే లైంగిక నేరాల్లో నిందితులకు కూడా క్యాస్ట్రేషన్ వంటి శిక్ష ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కొన్ని దేశాల్లో ఇలాంటి పద్ధతిని అవలంభిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ మీడియాతో పేర్కొన్నారు.
ఈ ఘటనలో నిందితులుగా భావిస్తోన్న ఇద్దరిలో ఇప్పటికే ఒకరిని పోలీసులు అరెస్టు చేసినట్లు పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఉస్మాన్ బజ్దార్ ట్విటర్లో వెల్లడించారు. ఇదిలాఉంటే, పాకిస్థాన్లో అత్యాచార శిక్షలను విచారించడం ఒక సవాల్ అనే చెప్పవచ్చు. తమకు జరిగిన పరాభవాన్ని బయటకు వచ్చి స్వేచ్ఛగా చెప్పుకునే వెసులుబాటు అక్కడి మహిళలకు లేదన్న విషయం ప్రపంచానికి తెలిసిందే. అంతేకాకుండా అక్కడి మహిళలపై పోలీసులకు ఉండే చిన్నచూపు, మహిళలకు స్వేచ్ఛలేకపోవడం వంటివి కూడా ఇలాంటి నేరాలు బయటకు రాకపోవడానికి మరో కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నైజీరియాలో ఇలాంటి నిర్ణయమే..!
అత్యాచార నేరాల్లో ఏ శిక్షను విధించాలనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తూనే ఉంది. మహిళల జీవితాల్ని దుర్భరంగా మార్చే ఇటువంటి నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్ష విధించాలని తాజాగా నైజీరియాలోని ఓ ప్రాంతం నిర్ణయించింది. నైజీరియాలోని కుదుమా రాష్ట్రంలో ఈ మధ్య అత్యాచార నేరాలు తీవ్రమవడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 14 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచార కేసుల్లో దోషిగా తేలినవారిని కృత్రిమ పద్ధతిలో పురుషత్వం కోల్పోయేలా(క్యాస్ట్రేషన్) చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంటే, అత్యాచార కేసుల్లో దోషులకు క్యాస్ట్రేషన్ చేయాలన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా భిన్న వాదనలున్నాయి. దీనివలన వారి శారీరక, తీవ్ర మానసిక సమస్యలు ఏర్పడతాయనే అభిప్రాయం కూడా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్లో ‘రామేశ్వరం కేఫ్’ బాంబు పేలుడు ఘటనలో కీలక కుట్రదారుని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. -
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!