11.68లక్షల పరీక్షలు.. 70వేల కేసులు

భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,68,705 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 70,496 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 59,06,151కి చేరింది............

Published : 09 Oct 2020 10:13 IST

దిల్లీ: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,68,705 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 70,496 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 59,06,151కి చేరింది. వీరిలో 8,93,592 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 59,06,069 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇక కొత్తగా 964 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,06,490కి పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 85.52 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.54 శాతంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని