24గంటల్లో 76,472 కేసులు.. 1,021 మరణాలు

భారత్‌లో కరోనా విజృంభణ రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత 24 గంటల్లో 76,472 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 34,63,973కు పెరిగింది. వీరిలో 7,52,424 మంది వివిధ......

Updated : 29 Aug 2020 10:48 IST

దిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత 24 గంటల్లో 76,472 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 34,63,973కు పెరిగింది. వీరిలో 7,52,424 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 26,48,998 మంది కోలుకొని ఇళ్లకు చేరారు. ఇక కొత్తగా 1,021 మంది మరణించడంతో.. మృతుల సంఖ్య 62,550కి పెరిగింది. వెయ్యికి పైగా మరణాలు సంభవించడం వరుసగా ఇది నాలుగోరోజు. రికవరీ రేటు 76.47 శాతంగా.. మరణాల రేటు 1.81 శాతంగా ఉంది. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 9,28,761 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని