42,156 రికవరీలు.. 41,100 కొత్త కేసులు

భారత్‌లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 8,05,589 పరీక్షలు జరపగా.. కొత్తగా  కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య కి చేరింది. వీరిలో 82,05,728 మంది కోలుకున్నారు..........

Updated : 15 Nov 2020 14:58 IST

దిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వరుసగా ఏడో రోజు 50 వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,05,589 పరీక్షలు జరపగా.. కొత్తగా 41,100 కేసులు వెలుగు చూశాయి. నిన్నటితో పోలిస్తే దాదాపు 8శాతం కేసులు తగ్గాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 87,73,479కి చేరింది. వీరిలో 82,05,728 మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 42,156 మంది ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు.  మరో 4,79,216 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్రియాశీల కేసుల సంఖ్య 5.44శాతానికి తగ్గింది. ప్రస్తుతం మరణాల రేటు 1.47 శాతంగా ఉంది. రికవరీ రేటు 93.09శాతానికి పెరిగింది. ఇక కొత్తగా 447 మంది కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోవడంతో మరణాల సంఖ్య 1,29,635కి చేరింది. రోజుకి సగటు కేసుల సంఖ్య గత ఐదు వారాలుగా క్రమంగా తగ్గుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీనికి సంబంధించిన గ్రాఫ్‌ను ట్విటర్‌లో పంచుకుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని