రోజువారీ కేసుల్లో ఆ దేశ మొత్తాలను దాటేశాం!
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే అత్యధికంగా 83,883 పాజిటివ్ కేసులు వెలుగుచూడడం దేశంలో కొవిడ్-19 తీవ్రతకు అద్దం......
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే అత్యధికంగా 83,883 పాజిటివ్ కేసులు వెలుగుచూడడం దేశంలో కొవిడ్-19 తీవ్రతకు అద్దం పడుతోంది. గతంతో పోలిస్తే వైరస్ వ్యాప్తి విస్తృతమవ్వడం.. పరీక్షల సంఖ్య పెరగడం ఇందుకు కారణం. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గుదల కనిపించకపోవడంతో రోజువారీ కేసుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే రీతిలో పెరిగితే కరోనా మహమ్మారి వెలుగుచూసిన చైనా మొత్తం కేసులను మన రోజువారీ కేసులు దాటేసే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు ఈ దేశాల స్థాయిలో..
దేశంలో ప్రస్తుతం అన్లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో గతంలో వందల్లో నమోదైన కేసుల సంఖ్య ఇప్పుడు వేలకు చేరింది. ముఖ్యంగా ఆగస్టు నెలలో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. ఆగస్టులో ఒకటో తేదీ నాటికి దేశంలో మొత్తం కేసులు 17 లక్షలు కాగా.. చివరి నాటికి రెట్టింపు అయ్యింది. ఆగస్టు మొదటి వారం నుంచి రోజూ 50వేల కేసులకు పైబడే రోజువారీ కేసులు నమోదు అవుతున్నాయి. అంటే బహ్రెయిన్ (మొత్తం కేసులు 52 వేలు), సింగపూర్ (56వేలు), పోర్చుగల్ (58 వేలు), పోలాండ్ (67వేలు), జపాన్ (69వేలు) యూఏఈ (70వేలు) దేశాల మొత్తం కేసులను ఇప్పటికే మనం దాటేశాం. ప్రస్తుతం స్వీడన్ (84వేలు), బెల్జియం (85వేలు) మొత్తం కేసులకు చేరువలో ఉన్నాం.
(నోట్: డబ్ల్యూహెచ్వో లెక్కల ప్రకారం..)
త్వరలో చైనాను..?
చైనాలో కేసుల పెరుగుదల తీరు ఇలా.. (pic credit: గ్రాఫ్ జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ)
కరోనా వైరస్ వెలుగుచూసిన చైనాలో ప్రస్తుతం మొత్తం కేసులు సంఖ్య 90,422గా ఉంది. కొత్తగా ఆ దేశంలో ఇప్పటికీ రోజూ 10 నుంచి 20 కేసులు వెలుగుచూస్తున్నాయి. మన దేశంలో లాక్డౌన్ మొదలైనప్పటికి చైనా అన్లాక్ ప్రక్రియ చేపట్టింది. అప్పటికే దాదాపు కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మన దేశంలో లాక్డౌన్ చేపట్టినప్పుడు కాకుండా.. అన్లాక్ మొదలైన తర్వాత కేసుల పెరుగుదల మొదలైంది. ఈ సమయంలో వైద్యపరంగా మౌలిక సదుపాయాలు పెంచుకోవడానికి ఈ సమయం ఉపయోగపడింది.
భారత్లో కేసుల పెరుగుదల తీరు (pic credit: గ్రాఫ్ జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ)
ఊరటనిచ్చే అంశాలివీ..
మన దేశంలో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కొన్ని ఊరట నిచ్చే అంశాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో మరణాల రేటు (1.7శాతం) తక్కువగా ఉంది. మన కంటే కేసుల పరంగా కేవలం లక్ష తేడాలో ఉన్న బ్రెజిల్లో మరణాల సంఖ్య 1.21 లక్షలు కాగా.. దాదాపు 60 లక్షల కేసులున్న అమెరికాలో 1.82 లక్షల మంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారు. భారత్ మరణాల సంఖ్య 67వేలతో పోలిస్తే బ్రెజిల్లో రెండు రెట్లు, అమెరికాలో మూడు రెట్ల అధికంగా మరణాలు సంభవించాయి. అలాగే, దేశంలో కోలుకున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. ఇప్పటికే 29.70 లక్షల మందికి పైగా కోలుకోగా.. మరో 8లక్షలకు పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. పరీక్షలు కూడా 10 లక్షలకు పైగానే జరుగుతున్నాయి. దేశంలో రోగ లక్షణాలు లేని వారే అధికంగా ఉంటున్నారు. అలాంటి వారు వైరస్ వ్యాప్తి కారకులు కాకుండా చూసేందుకు ఈ పరీక్షల సంఖ్య ఉపయోగపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో