భారీగా పెరిగిన ‘భారతీయుల ఆయుష్షు’!
భారతీయుల సగటు జీవితకాలం గత మూడు దశాబ్దాల కాలంలో భారీగా పెరిగినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 1990 సంవత్సరంలో 59.6 ఏళ్లుగా ఉన్న భారతీయుల ఆయుర్దాయం 2019నాటికి 70.8 ఏళ్లకు పెరిగినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.
అంతర్జాతీయ నివేదిక వెల్లడి
దిల్లీ: భారతీయుల సగటు జీవితకాలం గత మూడు దశాబ్దాల కాలంలో భారీగా పెరిగినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 1990 సంవత్సరంలో 59.6 ఏళ్లుగా ఉన్న భారతీయుల ఆయుర్దాయం 2019నాటికి 70.8 ఏళ్లకు పెరిగినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే, వీటిలో రాష్ట్రాల మధ్య తీవ్ర వ్యత్యాసాలున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో సగటు జీవితకాలం అత్యధికంగా 77.3 సంత్సరాలు ఉండగా, ఉత్తర్ప్రదేశ్లో 66.9 ఏళ్లుగా ఉన్నట్లు తేలింది. ఈ ముప్పై సంవత్సరాల కాలంలో భారతీయుల సగటు ఆయుష్షు పది సంవత్సరాలు పెరిగింది. వ్యక్తి మరణాలకు గల కారణాలు, వ్యాధుల తీవ్రతపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధన చేపట్టారు. దీనిలో భాగంగా మరణాలకు గల 286 కారణాలు, 369 వ్యాధులు, వివిధ రకాల గాయలను విశ్లేషిస్తూ 200 దేశాల్లో అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయన నివేదిక తాజాగా ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘ది లాన్సెట్’లో ప్రచురితమైంది.
మనదేశంలో వ్యక్తుల ఆయుర్దాయం భారీగా పెరిగినప్పటికీ ఆరోగ్యవంతమైన జీవితకాలం గడుపలేకపోతున్నారని, ఎక్కువ కాలం అనారోగ్యం, ఇతర వైకల్యాలతోనే గడుపుతున్నట్లు పరిశోధనలో పాల్గొన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, గాంధీనగర్కు చెందిన శ్రీనివాస్ గోలీ వెల్లడించారు. గడిచిన ముప్పై సంత్సరాలుగా స్థూలకాయం, అధిక షుగర్, కాలుష్యం కారకాలతో ప్రభావితం కావడం వల్ల ప్రస్తుతం కరోనా సమయంలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నట్లు తాజా నివేదిక అభిప్రాయపడింది. ఈ 30ఏళ్లలో ఆరోగ్య రంగంలో భారత్ గణనీయమైన మార్పును సాధించిందని నిపుణుల బృందం స్పష్టంచేసింది. అయితే, బిహార్, ఉత్తర్ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇంకా పోషకాహారం లోపంతో పిల్లలు, బాలింతలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది.
భారత్తో సహా దాదాపు ప్రతిదేశంలో అంటువ్యాధుల వ్యాప్తి తగ్గినప్పటికీ, దీర్ఘకాలిక వ్యాధుల పెరుగుతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన అలీ మొక్దాద్ పేర్కొన్నారు. మెరుగైన వైద్య సదుపాయాలు, ఇమ్యునైజేషన్ వంటి కార్యక్రమాల వల్ల అంటువ్యాధుల తీవ్రతను చాలా దేశాలు అరికట్టగలుతున్నట్లు తెలిపారు. ఇక దేశంలో గతంలో ఎక్కువగా కనిపించిన మాతాశిశు మరణాల సంఖ్య ప్రస్తుతం తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించారు. అయితే, గుండె సంబంధ వ్యాధులు ఐదో స్థానంలో ఉండగా ప్రస్తుతం అవి మొదటి స్థానంలోకి వచ్చాయని, వీటితో పాటు కాన్సర్లు భారీగా పెరినట్లు మొక్దాద్ తెలిపారు.
దీర్ఘకాలిక వ్యాధుల సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఉందని, వీటిలో ప్రజారోగ్య వ్యవస్థలు విఫలమవుతున్నట్లు పరిశోధన చేపట్టిన అంతర్జాతీయ నిపుణుల బృందం వెల్లడించింది. ముఖ్యంగా అధిక రక్తపోటు, పొగాకు వాడకం, గాలికాలుష్యం వంటి ప్రమాదకర పరిస్థితులను నిరోధించే వీలున్నప్పటికీ వీటిపై చర్యలు తీసుకోలేకపోతున్నట్లు అభిప్రాయపడింది. దీంతో కరోనా వంటి ప్రమాదకరమైన వ్యాధులకు ప్రజలు గురికావాల్సి వస్తుందని పరిశోధన బృందం స్పష్టంచేసింది.
నివేదికలోని మరికొన్ని విషయాలు..
* అనారోగ్య సమస్యలు, మరణాలకు ముప్పై ఏళ్ల ముందు అంటువ్యాధులు, మాతాశిశు మరణాలు, పోషకాహార లోపంతో కలిగిన వ్యాధులు కారణమైతే.. ప్రస్తుతం నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) ఎక్కువగా కారణమవుతున్నాయి.
* 1990లో 29శాతం ఉన్న ఎన్సీడీ మరణాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతోన్న మొత్తం వ్యాధుల్లో దాదాపు 58శాతానికి పెరిగాయి. అంతేకాకుండా అకాల మరణాలు దాదాపు 22శాతం నుంచి 55శాతానికి పెరిగాయి.
* గుండె జబ్బులు, సీఓపీడీ, మధుమేహం, గుండెపోటు, కండరాల బలహీనత వ్యాధులతోనే ఎక్కువ అనారోగ్యానికి గురవుతున్నారు.
* 2019లో భారత్లో మరణాలకు గాలికాలుష్యమే ప్రధానకారణం కాగా, దీని కారణంగా దాదాపు 16లక్షల మరణాలు సంభవించాయి. తరువాతి స్థానాల్లో హైబీపీ (14.7లక్షలు), పొగాకు వాడకం (12.3లక్షలు), ఆహారలేమి (11.8లక్షలు), బ్లడ్ షుగర్ (11.2లక్షలు) వల్ల ఎక్కువ మరణాలు సంభవించాయి.
ముఖ్యంగా దక్షిణాదిలోని ఎనిమిది రాష్ట్రాల్లో దాదాపు 10-20శాతం మరణాలకు హైబీపీ కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గాలి కాలుష్యం తర్వాత అత్యంత ప్రమాదకరంగా హైబీపీ ఉన్నట్లు పేర్కొన్నారు. వీటితోపాటు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మరణాలు ఎక్కువగా సంభవించడంలో స్థూలకాయం, మధుమేహం సమస్యలు కూడా ప్రధాన కారణమవుతున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది. ఇలాంటి సమయంలో దీర్ఘకాల వ్యాధులు, సామాజిక అసమానతలను పరిష్కరించడానికి అత్యవసర చర్యలు అవసరమని ఈ నివేదిక హెచ్చరించింది. ఈ ప్రమాదకారకాలు సాధ్యమైనంతవరకు నివారించదగినవి కావడంతోపాటు చికిత్సకు కూడా ఆస్కారం ఉందని స్పష్టంచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. -
మణిపుర్లో మానవహక్కుల ఉల్లంఘన
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది. -
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరి భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నానని ఒలింపిక్ పతకం విజేత విజేందర్ సింగ్ పేర్కొన్నారు. -
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
తాము అధికారంలోకి వస్తే సంపద పునర్విభజనపై సర్వే చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్ వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
క్షమాపణలు యాడ్ సైజ్లోనే ప్రచురించారా? పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!