India In UN: శాంతి పరిరక్షకులకు సాంకేతిక రక్ష
ఆధునిక కాలంలో ఎదురవుతున్న కొత్త ముప్పుల నుంచి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులను రక్షించుకోవాలంటే పటిష్ఠ సమాచార,
ఐరాస పటిష్ఠ భద్రత విధానాలను అందిపుచ్చుకోవాలి
భద్రత మండలి భేటీలో మంత్రి జైశంకర్
ఐరాస: ఆధునిక కాలంలో ఎదురవుతున్న కొత్త ముప్పుల నుంచి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులను రక్షించుకోవాలంటే పటిష్ఠ సమాచార, అత్యాధునిక నిఘా వ్యవస్థల అవసరం ఉందని భారత్ అభిప్రాయపడింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని హింసాత్మక చర్యలకు వినియోగించుకుంటూ శాంతి స్థాపనకు విఘాతం కల్పిస్తున్న వారిని దీటుగా ఎదుర్కొనేలా ఐరాస శాంతి పరిరక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ బుధవారం ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన భద్రత మండలి సమావేశంలో ‘శాంతి స్థాపన కోసం సాంకేతికత: రక్షకులకు రక్షణ’ అనే అంశంపై ప్రసంగించారు. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ సమక్షంలో నిర్వహించిన ఈ భేటీకి జైశంకర్ అధ్యక్షత వహించారు. 1948 నుంచి మొదలుకొని ఇప్పటివరకూ విభిన్న సవాళ్లను ఎదుర్కొంటూ ఐరాస శాంతి పరిరక్షణ కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయని జైశంకర్ పేర్కొన్నారు. భారత్ తరఫున ఐరాసకు ఇప్పటివరకూ 49 మిషన్ల కోసం 2.5 లక్షల ట్రూపులను పంపినట్లు పేర్కొన్నారు. ఐరాస శాంతి పరిరక్షకులకు భద్రత కల్పించడానికి మరింత సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా నాలుగు అంశాలతో కూడిన భద్రత వ్యవస్థను ఆయన ప్రతిపాదించారు. ‘‘సమాచార సేకరణ, వినియోగం, విశ్లేషణ, పంపిణీకి అత్యంత విశ్వసనీయమైన విధానాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా శాంతి పరిరక్షణ ప్రక్రియకు ఆరంభం నుంచే ప్రయోజనం కలుగుతుంది. ఘర్షణ ప్రాంతాల కచ్చితమైన గుర్తింపు, అక్కడి పరిస్థితుల ప్రత్యక్ష విశ్లేషణ నిఘా వ్యవస్థకు అత్యంత కీలకం. దీనివల్ల శాంతి పరిరక్షణ సిబ్బంది భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకోవచ్చు’’ అని జైశంకర్ చెప్పారు.
‘యునైట్ అవేర్’కు భారత్ రూపకల్పన
శాంతి పరిరక్షణ కార్యకలాపాలు జరిగే ప్రాంతాలను ప్రత్యక్షంగా చూస్తూ, అక్కడి పరిస్థితులను విశ్లేషిస్తూ సమన్వయం చేసుకోవడానికి వీలుకల్పించేలా ఓ కొత్త సాంకేతికతకు భారత్ రూపకల్పన చేసింది. ‘యునైట్ అవేర్’ పేరుతో రూపొందించిన ఈ పరిజ్ఞానానికి ఐరాస సహకారం అందించింది. దీనికోసం భారత్ 16.4 లక్షల డాలర్లను వెచ్చించింది. అంతకు ముందు భారత్, ఐరాసల మధ్య సాంకేతిక పరిజ్ఞాన భాగస్వామ్యం గురించి ఒప్పందం కుదిరింది.
రెండు పత్రాలకు ఏకగ్రీవ ఆమోదం
భారత్ అధ్యక్షతన ఐరాస భద్రత మండలి శాంతి పరిరక్షణకు సంబంధించి రెండు కీలక పత్రాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఐరాస శాంతి పరిరక్షకులపై జరిగే నేరాలకు బాధ్యులను గుర్తించేందుకుగానూ ‘అకౌంటబిలిటీ ఆఫ్ క్రైమ్స్ ఎగైన్స్ట్ యూఎన్ పీస్కీపర్స్’ అనే పత్రానికి భారత్ రూపకల్పన చేసింది. దీనికి భద్రత మండలిలోని అన్ని సభ్య దేశాలతో పాటు 80కి పైగా ఐరాస సభ్య దేశాలు సహకారం అందించాయి. శాంతి భద్రతల సమస్య పరిష్కారానికి అంతర్జాతీయ సమాజం మద్దతునివ్వాలని ఇందులో ప్రతిపాదించారు. శాంతి పరిరక్షణకు సాంకేతికత అవసరమంటూ భద్రత మండలి అధ్యక్షుడిగా జైశంకర్ చేసిన ప్రకటనతో కూడిన ‘టెక్నాలజీ ఫర్ పీస్కీపింగ్’ పత్రానికీ భద్రత మండలి ఆమోదం తెలిపింది. భద్రత మండలికి సంబంధించి ఈ తరహా పత్రాన్ని ఆమోదించడం ఇదే తొలిసారి. శాంతి పరిరక్షణలో అసువులు బాసిన ఐరాస కార్యకర్తల స్మృతి చిహ్నం వద్ద జైశంకర్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.
భారత పౌరులను తరలించడంపైనే దృష్టి: జైశంకర్
న్యూయార్క్: అఫ్గాన్లో జరుగుతున్న పరిణామాలను భారత్ అత్యంత జాగ్రత్తగా గమనిస్తునట్లు జైశంకర్ పేర్కొన్నారు. అక్కడ చిక్కుకుపోయిన భారత పౌరులను సురక్షితంగా తరలించడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టినట్లు చెప్పారు. భద్రత మండలి సమావేశం తర్వాత ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. అంతకు ముందు అఫ్గాన్లో ఉద్రిక్త పరిస్థితులపై ఆంటోనియో గుటెరస్తో జైశంకర్ చర్చించారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో గుటెరస్తో మంగళవారం భేటీ అయ్యారు. ఉత్తర ఐరోపా దేశం ఈస్టోనియా విదేశాంగ మంత్రి ఇవా-మారియాతోనూ జైశంకర్ సమావేశమై అఫ్గాన్ పరిణామాలను చర్చించారు.
చర్చల్లో కీలక భూమిక బరాదర్దే!
కాబుల్: అఫ్గాన్ ప్రభుత్వ అధికారులతో జరిపే చర్చల్లో తాలిబన్ల అగ్రశ్రేణి రాజకీయ నాయకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్దే కీలక పాత్ర కావచ్చని భావిస్తున్నారు. దశాబ్దాల తరబడి పోరాడడంలోనే కాకుండా డొనాల్డ్ ట్రంప్ సర్కారుతో ఒప్పందం కుదుర్చుకోవడంలోనూ ఈ నేతది ముఖ్య భూమిక. గతంలో అధికారంలోకి వచ్చిన రోజులతో పోలిస్తే తామెంతో మారామనీ, ‘సమ్మిళిత, ఇస్లామిక్ ప్రభుత్వం’ ఏర్పాటును తాము కోరుకుంటున్నామని తాలిబన్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముల్లాపైనే అందరి దృష్టి పడింది. తాలిబన్ కమాండర్ ముల్లా మహమ్మద్ ఒమర్ సజీవంగా ఉన్నప్పుడు డిప్యూటీలుగా వ్యక్తిగతంగా నియమించుకున్నవారిలో ప్రస్తుతం జీవించి ఉన్నది బరాదర్ మాత్రమే. ఇప్పటి సర్వోన్నత నేత మౌలావీ హిబాతుల్లా అఖ్తుంజాదా కంటే ఎక్కువగా బయటకు కనిపించేది ముల్లా బరాదరే. మంగళవారం కాందహార్కు చేరుకున్న ఈ నేతకు పెద్దఎత్తున స్వాగతం లభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1700 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు (10)
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. -
స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతం
హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ బుధవారం నిర్వహించిన రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!