ఫైజర్ వ్యాక్సిన్ అవసరం ఉండకపోవచ్చు
భారత్లో అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాలు ఉత్తమ ఫలితాలిస్తున్నాయని, అమెరికాకు చెందిన ఫైజర్ టీకా భారత్కు అవసరమయ్యే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు....
ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్
దిల్లీ: భారత్లో అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాలు ఉత్తమ ఫలితాలిస్తున్నాయని, అమెరికాకు చెందిన ఫైజర్ టీకా భారత్కు అవసరమయ్యే అవకాశం ఉండకపోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. దేశానికి చెందిన ఉత్తమ సంస్థలు ఐదు టీకాలను అభివృద్ధి చేస్తున్నాయని, అలాంటప్పుడు అమెరికాలోనే వినియోగానికి ఇంకా అనుమతులు లభించని ఫైజర్ టీకాను భారత్లో పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదన్నారు. ఆ వ్యాక్సిన్కు అమెరికాలో ఆమోదం లభించినా.. ముందుగా ఆ దేశస్థులకే ప్రధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు.
భారత్లో దాదాపు ఐదు సంస్థలు కరోనా టీకాను అభివృద్ధి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ పరీక్షలు వివిధ దశల్లో ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకా టీకా మూడో దశ పరీక్షలను సీరమ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తోంది. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకా రెండు దశలను పూర్తిచేసుకొని మూడో దశలోకి అడుగుపెట్టింది. రెండో దశ పరీక్షల ఫలితాలు ఏ సమయంలోనైనా వెలువడే అవకాశం ఉంది. జైడస్ క్యాడిలా హెల్త్ సంస్థ అభివృద్ధి చేస్తున్న జైకోవిడ్ కూడా రెండో దశ పరీక్షలను పూర్తి చేసుకుంది.
ఈ మూడు టీకాలే కాకుండా రష్యా అభివృద్ధి చేస్తున్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్ పరీక్షలను హైదరాబాద్కు చెందిన డా.రెడ్డీస్ ల్యాబ్ నిర్వహిస్తోంది. హైదరాబాద్కే చెందిన మరో సంస్థ ‘బయోలాజికల్ ఇ’కి చెందిన టీకా మొదటి, రెండో దశ ప్రయోగాల్లో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె