హద్దు మీరితే కాల్పులే!
తూర్పు లద్దాఖ్లో భారత శిబిరాలను ఆక్రమించడానికి ప్రయత్నిస్తే తమ బలగాలు కాల్పులకూ వెనుకాడబోవని మన దేశం.. చైనాకు స్పష్టంచేసింది.
తోపులాటలు, కర్రలతో ఘర్షణలు ఇక ఉండవు
సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ మీ వైపే ఆరంభం కావాలి
చైనాకు తేల్చి చెప్పిన భారత్
దిల్లీ : తూర్పు లద్దాఖ్లో భారత శిబిరాలను ఆక్రమించడానికి ప్రయత్నిస్తే తమ బలగాలు కాల్పులకూ వెనుకాడబోవని మన దేశం.. చైనాకు స్పష్టంచేసింది. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఇక కర్రలు, రాళ్లతో ఆటవిక పోరాటాలు ఉండబోవని తేల్చి చెప్పింది. పాంగాంగ్ సరస్సు వద్ద భారత్కు పట్టున్న దక్షిణ రేవు నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియను మొదలుపెడదామన్న డ్రాగన్ ప్రతిపాదనను తిరస్కరించింది. ఉద్రిక్తత నెలకొన్న అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ ప్రక్రియ సాగాల్సిందేనని స్పష్టంచేసినట్లు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఇటీవల జరిగిన సైనిక కోర్ కమాండర్ల స్థాయి చర్చల్లో ఈ అంశాలపై భారత్ తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు వివరించాయి. భారత శిబిరాలను ఆక్రమించడానికి లేదా కర్రలు, శూలాలు తదితర ఆయుధాలతో సామూహిక దాడులకు చైనా ప్రయత్నిస్తే కాల్పులు జరపాలని మన బలగాలకు ఆదేశాలు అందాయి. ఇదే విషయాన్ని డ్రాగన్ సేనకు తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘‘సరిహద్దుల్లో బలగాల పరస్పర తోపులాటలను ఇక సహించబోమన్న సందేశాన్ని వారికి చేరవేశాం. ఆటవిక ఆయుధాల వినియోగమూ కుదరదని తేల్చి చెప్పాం’’ అని వివరించాయి. పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ రేవుల్లో ఇప్పటికే పలుమార్లు గాల్లోకి కాల్పులు జరుపుకొన్న ఘటనలు జరిగాయని గుర్తు చేశాయి. ఇందులో చిన్నపాటి ఆయుధాలను మాత్రమే ఉపయోగించారని, భారీ ఆయుధాలను ఇంకా క్రియాశీలం చేయలేదని తెలిపాయి. ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో భారత సైనికులకు.. అమెరికా నుంచి తాజాగా దిగుమతి చేసుకున్న అత్యాధునిక సిగ్ సావర్ తుపాకులను అందజేసినట్లు పేర్కొన్నాయి.
జూన్ 15న గల్వాన్ లోయలో ఇరు దేశాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో అనేక మంది చైనా సైనికులు చనిపోయారని అధికార వర్గాలు చెప్పాయి. ‘‘సరిహద్దుల రక్షణకు ఎంతకైనా సిద్ధమన్న సంకేతాన్ని ఈ చర్య ద్వారా చైనాకు ఇచ్చాం. నాటి ఘర్షణలో బెటాలియన్ కమాండర్ సహా కనీసం ఐదుగురు సైనికులు చనిపోయినట్లు దౌత్య చర్చల్లో చైనా అధికారులు అంగీకరించారు. వాస్తవంగా వారి వైపున ప్రాణనష్టం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండొచ్చు’’ అని ఓ అధికారి తెలిపారు. సరిహద్దుల్లో బలగాలను పెంచరాదంటూ కుదిరిన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే చైనా మాటలను తాము గుడ్డిగా నమ్మబోమని, అప్రమత్తతను కొనసాగిస్తామని తెలిపారు. ఆ దేశం విశ్వాసఘాతుకానికి పాల్పడ్డ ఉదంతాలు అనేకం ఉన్నాయని వివరించారు.
మొదట మీరే..
బలగాల ఉపసంహరణ ప్రక్రియపై రెండు దేశాల సైన్యాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలన్న అంశంపై మాత్రం ఏకాభిప్రాయం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ‘‘బలగాల ఉపసంహరణపై జరిగే చర్చల్లో దెప్సాంగ్, సైనిక ప్రతిష్టంభన ఏర్పడిన ఇతర ప్రాంతాలనూ చేర్చాలని స్పష్టంచేశాం. ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి కాకుండా ఏకకాలంలో ఉపసంహరణ జరగాలన్నాం. చైనా దురుసు చర్యల వల్లే ఈ సైనిక ప్రతిష్టంభన ఏర్పడిందని, అందువల్ల బలగాల ఉపసంహరణ విషయంలో ముందుగా చర్యలు చేపట్టాల్సింది ఆ దేశమేనని తేల్చి చెప్పాం. పాంగాంగ్ దక్షిణ రేవులో భారత బలగాల ఆధీనంలో ఉన్న పర్వత ప్రాంతాలు తమ భూభాగం పరిధిలోకే వస్తాయని, అక్కడి నుంచి సైనికులను వెనక్కి రప్పించబోమని స్పష్టంచేశాం’’ అని తెలిపాయి. అయితే ఇరు దేశాల మధ్య బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కావడానికి మరికొన్ని చర్చలు అవసరమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
నిఘా వైఫల్యం లేదు..
ఎల్ఏసీ వెంబడి చైనా 50వేలకుపైగా బలగాలు, ట్యాంకులు, శతఘ్నులను మోహరించిందని భారత వర్గాలు తెలిపాయి. వీరి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నట్లు పేర్కొన్నాయి. ఏ దశలోనూ నిఘా వైఫల్యం లేదని వివరించాయి. అయితే చివరి నిమిషంలో జరిగే కదలికలు, మోహరింపులను తెలుసుకోవడం కష్టమని తెలిపాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసిన తీరును వివరిస్తూ.. ‘‘మే 5న గల్వాన్, పాంగాంగ్, నాకులా వద్ద ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరిగాయి. పాంగాంగ్ వద్ద ఫింగర్-4 ప్రాంతం వద్ద సైనిక ప్రతిష్టంభన చోటుచేసుకుంది. సాధారణంగా అలాంటి సందర్భాల్లో రెండు దేశాల తరఫున 30-40 మంది సైనికులు చొప్పున మాత్రమే అక్కడ ఉంటారు. కొద్దిసేపు ఎదురెదురుగా నిలబడ్డాక వెనుదిరుగుతుంటారు. మే నెలలో మాత్రం చైనా వెయ్యి మందికిపైగా సైనికులను అక్కడికి పంపింది. ఫింగర్-4 ప్రాంతాన్ని ఆక్రమించింది’’ అని పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..