మత్య్సకారులపై  శ్రీలంక నేవీ దాడి

అంతర్జాతీయ సరిహద్దు నిబంధనలను ఉల్లంఘించి తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ శ్రీలంక నేవీ సిబ్బంది భారత మత్స్యకారులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఓ మత్స్యకారుడు తీవ్రంగా గాయపడ్డారు.  అయితే శ్రీలంక నేవీ కావాలనే తమపై దాడి చేసిందని, తాము విదేశీ జలాల్లోకి ప్రవేశించలేదని మత్స్యకారులు..

Updated : 27 Oct 2020 10:44 IST

చెన్నై: అంతర్జాతీయ సరిహద్దు నిబంధనలను ఉల్లంఘించి తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ శ్రీలంక నేవీ సిబ్బంది భారత మత్స్యకారులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఓ మత్స్యకారుడు తీవ్రంగా గాయపడ్డారు.  అయితే శ్రీలంక నేవీ కావాలనే తమపై దాడి చేసిందని, తాము విదేశీ జలాల్లోకి ప్రవేశించలేదని మత్స్యకారులు చెబుతున్నారు. తమపై రాళ్లు విసిరారని, వలలను చింపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన మత్స్యకారుడిని తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

తమిళనాడుకు చెందిన మత్స్యకారులపై శ్రీలంక నేవీ సిబ్బంది దాడి చేయడం రివాజుగా మారిపోయింది. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్నిసార్లు మత్స్యకారులను అక్కడికి తీసుకెళ్లి జైలులో బంధించిన  సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి ఘటనలను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. భారత మత్స్యకారులపై శ్రీలంక నేవీ సిబ్బంది దాడులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఇది వరకే లేఖ రాసింది. హిందూమహాసముద్రంలో ఇలాంటి ఘటనలకు చరమగీతం పాడేలా శ్రీలంక ప్రభుత్వంతో చర్చించాలని ఇదివరకే కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని