చైనా చీమలు కదలినా తెలిసేలా ఉపగ్రహ నిఘా!
దురహంకారపూరిత చైనా కుయుక్తులకు పైఎత్తులు వేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. హిమాలయ పర్వత సానువుల్లో డ్రాగన్పై పటిష్ఠ నిఘా పెట్టాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా 4-6 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తే బాగుంటుందని యోచిస్తోంది...
ఇంటర్నెట్డెస్క్: దురహంకారపూరిత చైనా కుయుక్తులకు పైఎత్తులు వేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. హిమాలయ పర్వత సానువుల్లో డ్రాగన్పై పటిష్ఠ నిఘా పెట్టాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా 4-6 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తే బాగుంటుందని యోచిస్తోంది. 4000 కిలోమీటర్ల మేర సరిహద్దుల్లోని కొండలు, లోయల్లో కమ్యూనిస్టు చైనా సైనికులు ఒక్క అడుగు ముందుకు వేసినా తెలిసిపోయేలా చర్యలు చేపట్టాలన్నది సైన్యం ఉద్దేశంగా కనిపిస్తోంది.
రెండుదేశాల సరిహద్దుల్లోని భారత్కు చెందిన కొన్ని భూభాగాలని చైనా తమదిగా చెప్పుకొనే సంగతి తెలిసిందే. పదేపదే ఆ దేశ సైనికులు భారత్ వైపు వస్తుంటారు. కొన్నాళ్ల క్రితం జిన్జియాంగ్ ప్రాంతంలో చైనా దాదాపు 40వేల మంది సైనికులు, భారీ స్థాయిలో ఆయుధాలు, యుద్ధ సామగ్రిని మోహరించింది. అక్కడి నుంచి భారత్కు చెందిన కొన్ని ప్రాంతాల్లో శిబిరాలు వేసుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి ఘటనలు ముందే తెలియాలంటే ఉపగ్రహ నిఘా అవసరమని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.
‘భారత, శత్రుదేశ సరిహద్దు ప్రాంతాల్లోని లోయల్లో చైనా సైనికుల కదలికలు మరింత విస్పష్టంగా తెలియాలంటే మనకు కచ్చితంగా 4-6 ఉపగ్రహాలు అవసరం. వీటికి హై రిజల్యూషన్ సెన్సార్లు, కెమెరాలు ఉండాలి. చీమ కదిలినా మనకు తెలియాలి’ అని సైనిక వర్గాలు అన్నట్టు తెలిసింది. జూన్ నెలలో గల్వాన్ లోయలో డ్రాగన్ సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దీంతో సరిహద్దుల్లో ఉద్రికత్తలు పెరిగాయి. దాదాపుగా యుద్ధఛాయలు కనిపించాయి. ప్రస్తుతం సైనిక, దౌత్యపరంగా చర్చలు కొనసాగుతున్నప్పటికీ పాంగాంగ్ సరస్సు, గోగ్రా, ఫింగర్ ఫోర్ ప్రాంతాల నుంచి సైనికులను వెనక్కి పంపించేందుకు చైనా మొండికేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.