లాక్డౌన్లో బోర్.. స్నాక్స్తో పరార్
ఖాళీగా కూర్చుకున్నప్పుడు చిరుతిళ్లు తినడం.. చిప్స్ ప్యాకెట్ పట్టుకుని టీవీ ముందు కూర్చోవడం మనలో చాలా మందికి అలవాటే.. అయితే ఈ ఏడాది కరోనా తెచ్చిన లౌక్డౌన్ కారణంగా చాలాకాలం ఇళ్లల్లోనే ఉండిపోవాల్సి
కరోనా ముందుతో పోలిస్తే ఎక్కువగా చిరుతిళ్లు
ఇంటర్నెట్డెస్క్: ఖాళీగా కూర్చున్నప్పుడు చిరుతిళ్లు తినడం.. చిప్స్ ప్యాకెట్ పట్టుకుని టీవీ ముందు కూర్చోవడం మనలో చాలా మందికి అలవాటే.. అయితే ఈ ఏడాది కరోనా తెచ్చిన లౌక్డౌన్ కారణంగా చాలాకాలం ఇళ్లల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. బయటకు వెళ్లే పరిస్థితి లేక.. ఇంట్లో కాలక్షేపం కాక లాక్డౌన్ తొలినాళ్లలో చాలా మంది బోర్గా ఫీలయ్యారు. ఇంకేముంది టైంపాస్ కోసం నోటికి పనిచెప్పారు. అలా లాక్డౌన్లో స్నాక్స్ను విపరీతంగా లాగించేశారు. కరోనా ముందు కాలంతో పోలిస్తే భారతీయులు ఎక్కువగా చిరుతిళ్లు తిన్నారట. ఈ మేరకు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
లాక్డౌన్లో ఆహార అలవాట్లపై మోండెలెజ్ ఇంటర్నేషనల్, ది హారిస్ పోల్ ఈ ఏడాది అక్టోబరులో ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ సర్వే చేపట్టింది. దీని ప్రకారం.. ప్రతి 10 మంది భారతీయుల్లో 9 మంది గతంలో కంటే లాక్డౌన్ కాలంలో ఎక్కువగా స్నాక్స్ తిన్నట్లు తేలింది. 66శాతం మంది బోర్డమ్ను పోగొట్టుకునేందుకు చిరుతిళ్లను ఎంచుకున్నారట. భోజన సమయంలోనూ పంటికింది కోసం స్నాక్స్ ఎక్కువగా తీసుకున్నట్లు ఈ సర్వే పేర్కొంది. చిరుతిళ్లు ఆనందంతో పాటు సౌకర్యాన్ని ఇవ్వడమేగాక, ఒంటరితనాన్ని కూడా దూరం చేశాయని భారతీయలు భావించినట్లు సర్వే వెల్లడించింది.
ఇక మహమ్మారి తీవ్రంగా ఉన్న తొలినాళ్లలో లాక్డౌన్ సమయంలో చాలా మంది భారతీయులు స్వయంగా వంటలు చేసుకునేందుకు ఇష్టపడ్డారు. వంటల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి చూపారని సర్వే తెలిపింది. అయితే దీని వల్ల ఆహార విక్రయాలు సన్నగిల్లాయి. మార్కెట్ రీసర్చర్ నీల్సన్ అధ్యయనం ప్రకారం.. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో స్నాక్స్, పానియాల అమ్మకాలు 25శాతం పడిపోగా.. సెప్టెంబరు త్రైమాసికంలో 6.9శాతం తగ్గాయి. అయితే అన్లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత.. ప్రజలు మళ్లీ బయట ఆహారానికి మొగ్గుచూపారు. కాగా.. ఇప్పటికీ 81శాతం మంది భారతీయులు భారీ భోజనాల కంటే చిరుతిళ్లనే కొనసాగించేందుకు ఇష్టపడుతున్నట్లు తాజా సర్వే పేర్కొంది. చిరుతిళ్లలో ఎక్కువగా ప్రొటీన్, విటమిన్లు ఉన్నవాటికే చాలా మంది ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపింది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.