సూది లేకుండానే కొవిడ్టీకా..!
నవంబర్ వచ్చేసింది.. ఎక్కడ చూసినా కొవిడ్ టీకా ఎప్పుడూ అనే చర్చే జరుగుతోంది. దీనికి తగ్గట్లుగానే టీకాల అభివృద్ధి కూడా రాకెట్ వేగంతో జరుగుతోంది. అదే సమయంలో ఓ కొత్త రకం టీకా జనం దృష్టిని ఆకర్షిస్తోంది. అదే ఇంట్రా నాసల్ కొవిడ్ టీకా..!
ఇంట్రా నాసల్ అత్యంత సులువు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
నవంబర్ వచ్చేసింది.. ఎక్కడ చూసినా ఇప్పుడు కొవిడ్ టీకా ఎప్పుడు వస్తుందనే చర్చే జరుగుతోంది. దీనికి తగ్గట్లుగానే టీకాల అభివృద్ధి కూడా రాకెట్ వేగంతో జరుగుతోంది. అదే సమయంలో ఓ కొత్త రకం టీకా జనం దృష్టిని ఆకర్షిస్తోంది. అదే ఇంట్రా నాసల్ కొవిడ్ టీకా..! అదేనండీ ముక్కులో వేసుకొనే వ్యాక్సిన్..! ప్రస్తుతం దీనికి సంబంధించిన అడ్వాన్స్డ్ స్టేజి ప్రయోగాలు భారత్లో ప్రారంభం కానునున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ వ్యాక్సిన్ ఏమిటీ.. సాధారణ వ్యాక్సిన్కు భిన్నంగా దీనిపై ఎందుకు ప్రయోగాలు చేపట్టారు.. దీని లాభాలేమిటీ అనే అంశంపై ప్రజల్లో కుతూహలం పెరిగింది.
టీకాలను ఎలా వాడతారు..?
సాధారణ టీకాల వినియోగానికి పలు విధానాలు ఉంటాయి. ముఖ్యంగా వయస్సు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొంటారు. చాలా టీకాలను ఇంజెక్షన్ రూపంలో శరీరంలోని కండరాల్లోకి ప్రవేశపెడతారు. దీనిని ఇంట్రా మస్క్యూలర్ అంటారు. కొన్ని చర్మం, కండరం మధ్య ప్రదేశంలో చేస్తుంటారు. దీనిని సబ్కటానియస్ విధానం అంటారు. ఇక పిల్లలకు పోలియో నిరోధక టీకాలు వంటివి ప్రత్యేకమైన సొల్యూషన్తో కలిపి చుక్కల మందు రూపంలో నోటిలో వేస్తారు. మరికొన్ని టీకాలను ముక్కులో కండరాలపై పిచికారి చేయడం లేదా పీల్చుకోవడం చేస్తారు. దీనిని ఇంట్రానాసల్ విధానం అంటారు. ప్రస్తుతం ఇలాంటి టీకాలకు సంబంధించి హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ 100 కోట్ల డోసులను ఉత్పత్తి చేయనుంది. సెయింట్ లూయిస్లోని ‘ది వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్’ సహకారంతో వీటిని అభివృద్ధి చేయనుంది. సీరమ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇటువంటి టీకాపై పనిచేస్తోంది.
ఎలా వినియోగిస్తారు..?
ఇంట్రా నాసల్ టీకాను ముక్కు రంధ్రాల్లో పిచికారీ చేస్తారు. ఇది ముక్కు రంధ్రాలు.. దానికి సంబంధించిన కండరాలపై వ్యాపిస్తుంది. ఇప్పటికే జలుబు ఔషధాలను ఈ విధంగా పిచికారీ చేయడం చూస్తున్నాం.
ప్రయోజనాలు ఏమిటీ..?
* ఖర్చు తగ్గుతుంది: ఈ విధానంలో సిరంజీల వినియోగం గణనీయంగా తగ్గిపోతుంది. దీంతోపాటు సూదులు వాడకం అసలే ఉండదు. ఆల్కహాల్ స్వాబ్ల అవసరమే రాదు.
* తక్కువ సిబ్బందితోనే..: టీకాపై ఉండే సూచనలు పాటిస్తూ.. సాధారణ నాసల్ స్ప్రే వలే వినియోగించవచ్చు. కొంత అవగాహన ఉంటే సొంతంగా వాడుకోవచ్చు. పెద్ద సంఖ్యలో సుశిక్షితులైన సిబ్బంది అవసరం లేదు.
* అదనపు రోగనిరోధక శక్తి : ఇంట్రా నాసల్ టీకా రక్తంలో వ్యాధినిరోధక శక్తి ఉత్పత్తి అయ్యేలా చూస్తుంది. దీంతోపాటు అదనపు వ్యాధినిరోధక కణాలు ముక్కు, నోరు, ఊపిరితిత్తుల్లో పుట్టుకొచ్చినట్లు కనుగొన్నారు. ఇలా కండరాల్లో పుట్టుకొచ్చిన వ్యాధినిరోధక కణాల్లోని టిసెల్స్ వైరస్ను గుర్తు పెట్టుకొంటాయి. దీంతో వైరస్ మనిషి శరీరంలో ప్రవేశించే మార్గాల్లోనే ఇవి అడ్డుకొంటాయి.
ఇబ్బందులు ఏమిటీ..?
సక్సెస్ రేట్: అతి తక్కువ ఇంట్రా నాసల్ టీకాలను తయారు చేశారు. ఇప్పటి వరకు వీటిల్లో బలహీన పర్చిన ఇన్ఫ్లూయెంజా వైరస్ను వినియోగించారు.
ప్రభావం: ఈ విధానాన్ని ఇప్పటి వరకు జంతువులపై ఎక్కువగా ప్రయోగించారు. మునుషలపై ఎంతవరకు ప్రభావం చూపిస్తాయో ఇంకా పూర్తి స్థాయి అంచనాకు రావాలి.
తక్కువ మొత్తం: ముక్కు రంధ్రాల ద్వారా అతి తక్కువ మొత్తాన్ని మాత్రమే శరీరంలోకి పంపగలం. ఒక్కో నాసికా రంధ్రం ద్వారా 0.1 ఎంఎల్ పంపిస్తారు. కండరాలలో ఎక్కించే టీకాతో పోలిస్తే ఇది చాలా తక్కువ మొత్తం. ఎటువంటి పరికరం వాడి పంపిస్తున్నామన్నదానిని బట్టి కూడా ఇది మారుతూ ఉంటుంది.
‘ఇంట్రా నాసల్ విధానం’ అత్యంత తేలిక: కిరణ్ మజూందార్ షా
కొవిడ్ టీకాను నాసికా రంధ్రాల ద్వారా మనిషికి ఇవ్వడం అత్యంత తేలికైన విధానమని బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కిరణ్ మజూందార్ షా ట్విటర్లో పేర్కొన్నారు. ఆశా వర్కర్లకు శిక్షణ ఇచ్చి కూడా ఈ టీకాలను ప్రజలకు వేయవచ్చని ఆమె పేర్కొన్నారు. అదే కండరాలకు చేసే టీకాల పంపిణీకి సుశిక్షితులైన నర్సులు, వైద్యులు అవసరం. అది పెద్ద సవాలు. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న సింగల్ డోస్, శక్తిమంతమైన నాసల్ వ్యాక్సిన్ గేమ్ ఛేంజర్ కాగలదా..? అని ఆమె ఆంగ్లపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని షేర్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో సక్సెస్.. ఛత్తీస్గఢ్లో బోల్తా.. ఇంతకీ ‘ఎగ్జిట్ పోల్స్’ గెలిచాయా?
Exit polls predictions: ఐదు రాష్ట్రాలకు గాను నాలుగు రాష్ట్రాల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. ఇంతకీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయా? ఎంతవరకు అందుకున్నాయి. -
కళ్లప్పగించి చూడొద్దు మిత్రమా.. కంటిని హెచ్చరించే సాంకేతిక
డిజిటల్ యుగంలో మొబైళ్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లను సుదీర్ఘ సమయం పాటు వినియోగించిక తప్పని స్థితి. ఈ వాడకమే పొడిబారే కంటి (డ్రై ఐ) సమస్యకు దారి తీస్తుంది. -
శిరిడీ సాయి కానుకలతో బంగారు, వెండి నాణేలు
మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు సమర్పించే బంగారం, వెండి కానుకలను కరిగించి పతకాలు, నాణేలుగా మార్చాలని నిర్ణయించింది. -
Supreme Court: అత్యాచారం కేసు మహిళపై పెట్టొచ్చా?
సాధారణంగా అత్యాచార కేసుల్లో మహిళలు బాధితులుగా ఉంటారు. ఇటువంటి కేసుల్లో మహిళలపై అభియోగాలు నమోదు చేయవచ్చా? అనే అంశం పరిశీలనకు దేశ సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. -
క్రిమినల్ చట్టాల బిల్లులకు హిందీ పేర్లా?
ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో కొత్తగా తెస్తున్న బిల్లులకు ఆంగ్లంలో కాకుండా హిందీలో పేర్లు పెట్టి దక్షిణాది ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడు, కేరళ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఛత్తీస్గఢ్లో ఐఈడీ పేలి ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో శనివారం మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. -
సౌరగాలి రేణువులను శోధించిన ఆదిత్య-ఎల్1
సూర్యుడిపై పరిశోధనలకు భారత్ ప్రయోగించిన ‘ఆదిత్య-ఎల్1’ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ ఉపగ్రహంలోని ‘ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్’ (ఏఎస్పీఈఎక్స్) అనే పేలోడ్.. సౌర గాలుల్లోని అయాన్లకు సంబంధించిన కొలతలను విజయవంతంగా సేకరించింది. -
రైల్వేలను మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోంది: ఖర్గే
రైల్వేలను నాశనం చేసేందుకు మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. -
గగన్యాన్కు వ్యోమగాములు సిద్ధం
‘గగన్యాన్’ కోసం ఎంపికైన వ్యోమగాములు రోదసిలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
‘రైతు నేతల నిర్బంధాన్ని సహించం’
మూడు వ్యవసాయ చట్టాల(ప్రస్తుతం రద్దయ్యాయి)ను వ్యతిరేకిస్తూ ఉద్యమించిన నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆరోపించింది. -
తరగతి గదుల్లో హిజాబ్ వద్దన్నందుకు బెదిరింపులు
అమ్మాయిలను తరగతి గదుల్లో హిజాబ్ (ముఖ వస్త్రం) తొలగించాలని కోరినందుకు బిహార్లో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఆయా విద్యార్థినుల కుటుంబాల నుంచి బెదిరింపులు వచ్చాయి. -
ఆప్ ఎంపీ సంజయ్పై ఛార్జ్షీట్
దిల్లీ మద్యం కుంభకోణం, దానికి సంబంధించిన నగదు అక్రమ లావాదేవీల వ్యవహారంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్పై ఈడీ అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. -
ఏడు గంటలు ఆలస్యంగా ఎయిర్పోర్ట్కు విమానం
దేశ రాజధాని దిల్లీ నుంచి పట్నాకు వెళ్లాల్సిన విమానం ఏడు గంటలు ఆలస్యంగా విమానాశ్రయానికి రావడంపై ప్రయాణికులు మండిపడ్డారు. -
ప్రభుత్వం బలహీనుల పక్షం వహించాలి
సామాజికంగానూ, సంఖ్యాపరంగానూ దుర్బలులుగా ఉండే ప్రజలకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచినప్పుడే ప్రజాస్వామ్యంలో పౌరులందరూ స్వేచ్ఛగా ఉండగలరని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. -
డీప్ఫేక్పై ముర్ము ఆందోళన
దేశంలో అలజడి సృష్టిస్తున్న డీప్ఫేక్ వీడియోలపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మరోసారి ఆందోళన వ్యక్తంచేశారు. -
బహిష్కరణ.. మరీ కఠినమైన శిక్ష
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను పార్లమెంటు నుంచి బహిష్కరిస్తే.. దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని లోక్సభలో కాంగ్రెస్ సభా పక్ష నేత అధీర్ రంజన్ చౌధరి పేర్కొన్నారు. -
కశ్మీర్ ప్రధాన రహదారిపై భారీగా మంచు
జమ్మూకశ్మీర్లోని పూంఛ్ జిల్లా పీర్ పంజాల్ పర్వత ప్రాంతంలో విస్తారంగా మంచు కురుస్తోంది. ప్రధాన రహదారి అయిన మొగల్ రోడ్డుపై గుట్టలుగా పేరుకుపోతోంది. -
14 ఏళ్లకే మూడు డాక్టరేట్లు.. వంద ప్రపంచ రికార్డులు!
అమ్మ, అమ్మమ్మల స్ఫూర్తితో యోగాపై ఆసక్తి పెంచుకుంది ప్రిశా. పట్టుదలతో నిరంతర సాధన చేసి పిన్నవయసులోనే అద్భుతాలు సాధించింది. -
రామయ్య ప్రాణప్రతిష్ఠకు రారమ్మని ఆహ్వానాలు
అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠకు ఆహ్వాన పత్రికల పంపిణీ ప్రారంభమైంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనవరి 22న నిర్వహించనున్న శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ఆహ్వాన పత్రికలను పంపుతోంది. -
11 మందికి రూ.కోటికి పైగా వార్షిక వేతనం
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)-గువాహటిలో 2023-24 సంవత్సరానికి సంబంధించి శుక్రవారం నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో విద్యార్థులు తొలి రోజు 164 ఉద్యోగాలు పొందారు. -
ఆర్మ్స్ట్రాంగ్ జుత్తు.. జాబిల్లి శిలలు
చంద్రుడిపై కాలుమోపిన తొలి మానవుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ జుత్తు, చందమామ, అంగారకుడి శిలలు వంటి వాటిని కోల్కతాలోని అంతరిక్ష ప్రదర్శనశాలలో ఇక నుంచి వీక్షించొచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
DGP Anjani Kumar: తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ను సస్పెండ్ చేసిన ఈసీ
-
Assembly election Results: మూడు రాష్ట్రాల ఫలితాలు.. ప్రముఖుల గెలుపోటములు ఇలా..!
-
Chhattisgarh Election Results: ఛత్తీస్గఢ్లో మోదీ మ్యాజిక్తో భాజపా జోరు
-
Telangana Election Results: తెలంగాణ ‘హస్త’గతం ఇలా..!
-
Assembly Election Results: మూడు రాష్ట్రాల్లో భాజపా జోరు.. ట్వీట్ చేసిన మోదీ
-
KCR: ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా