ఇజ్రాయెల్.. 2 ఏళ్లు.. నాలుగోసారి ఎన్నికలు
ఇజ్రాయెల్లో ఏడు నెలలు తిరగకుండానే ప్రభుత్వం కుప్పకూలింది. గడువులోగా బడ్డట్ ఆమోదించడంలో విఫలం కావడంతో బుధవారం పార్లమెంట్ రద్దయింది. వచ్చే ఏడాది మార్చి 23న ఎన్నికలు జరిగే అవకాశమున్నట్లు
ఏడు నెలలకే కుప్పకూలిన నెతన్యాహు ప్రభుత్వం
జెరూసలెం: ఇజ్రాయెల్లో ఏడు నెలలు తిరగకుండానే ప్రభుత్వం కుప్పకూలింది. గడువులోగా బడ్జెట్ ఆమోదించడంలో విఫలం కావడంతో బుధవారం పార్లమెంట్ నెస్సెట్ రద్దయింది. వచ్చే ఏడాది మార్చి 23న ఎన్నికలు జరిగే అవకాశమున్నట్లు సమాచారం. కాగా.. రెండేళ్ల వ్యవధిలో ఇజ్రాయెల్లో ఎన్నికలు జరుగుతుండటం ఇది నాలుగో సారి కావడం గమనార్హం.
ఈ ఏడాది ఏప్రిల్లో బెన్నీ గాంట్జ్ నేతృత్వంలోని బ్లూ అండ్ వైట్ పార్టీ.. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలోని లికుడ్ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ప్రధాని పదవిని పంచుకోవాలని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నాయి. 18 నెలలు నెతన్యాహు ప్రధానిగా పనిచేసిన తర్వాత గాంట్జ్కు పగ్గాలు అప్పగించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే, ఈ మధ్యలోనే ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. దేశ బడ్జెట్పై రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 2020, 2021 రెండు సంవత్సరాలకు బడ్జెట్ను రూపొందించాలని గాంట్జ్ డిమాండ్ చేశారు. ఇందుకు నెతన్యాహు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి గడువులోగా బడ్జెట్ను ఆమోదించకపోవడంతో పార్లమెంట్ రద్దయింది. ఫలితంగా ప్రభుత్వం కూలిపోయి మళ్లీ ఎన్నికలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వం కూలిపోవడంపై ప్రధాని నెతన్యాహు, బెన్నీ గాంట్జ్ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. తమ ఒప్పందం నుంచి బ్లూ అండ్ వైట్ వైదొలిగి కొవిడ్ సంక్షోభ సమయంలో అనవసరంగా ఎన్నికలు వచ్చేలా వ్యవహరిస్తోందని నెతన్యాహు ఆరోపించారు. ‘ఎన్నికలకు మేం అనుకూలంగా కాదు. కానీ, తప్పట్లేదు. అయితే రానున్న ఎన్నికల్లో మా పార్టీ విజయం సాధిస్తుంది’ అని నెతన్యాహు తెలిపారు. మరోవైపు ప్రధాని తన విచారణలో మునిగి తేలుతూ ప్రజా ప్రయోజనాలను పట్టించుకోలేదని గాంట్జ్ విమర్శించారు. జైలుకు వెళ్లకుండా తప్పించుకునేందుకే మళ్లీ ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు.
బెన్నీ గాంట్జ్
రెండేళ్లలో నాలుగోసారి..
ఇజ్రాయెల్లో ఎన్నికలు జరగుతుండటం రెండేళ్ల వ్యవధిలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. గతేడాది నుంచి ఇక్కడ రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. 120 సీట్లున్న పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 61 సీట్లు గెలవాలి. 2019 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో అటు నెతన్యాహు పార్టీకి గానీ.. ఇటు ప్రతిపక్ష బెన్నీ గాంట్జ్ పార్టీకి గానీ మెజార్టీ రాలేదు. కూటముల ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అదే ఏడాది సెప్టెంబరులో మరోసారి ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తడంతో 2020 మార్చిలో మూడోసారి ఎన్నికలు జరిపారు. ఈ ఎన్నికల్లోనూ నెతన్యాహు పార్టీకి 36 సీట్లు.. గాంట్జ్ పార్టీకి 33 సీట్లు వచ్చాయి. అయితే, కొవిడ్ దృష్ట్యా ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నెతన్యాహు, గాంట్జ్ ఏళ్ల నాటి వైరాన్ని పక్కనబెట్టారు. పాత విభేదాలను మరిచి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అది ఎంతోకాలం నిలువకపోవడం గమనార్హం.
నెతన్యాహు.. ఐదుసార్లు
ఇజ్రాయెల్ దేశానికి నెతన్యాహు సుదీర్ఘ కాలం నుంచి ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. 1996-99 మధ్య తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆ తర్వాత 2009లో రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు (2009, 2013, 2015, 2020) ఈ పదవిలో కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధిస్తే.. ఆరోసారి ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశముంది.
ఇవీ చదవండి..
2020లో ప్రపంచాన్ని కుదిపేసిన ఘటనలు!
17లక్షల మందిని కబలించిన కాలుష్యం!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM