India- Japan: భారత్లో ₹3.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న జపాన్
వచ్చే ఐదేళ్లలో భారత్లో దాదాపు ఐదు ట్రలియన్ యెన్లు (సుమారు రూ.3.20లక్షల కోట్లు) జపాన్ పెట్టుబడులు పెట్టనుంది. ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిదాతో భేటీ అనంతరం ఈ విషయాన్ని ప్రధాని మోదీ వెల్లడించారు.
దిల్లీ: వచ్చే ఐదేళ్లలో భారత్లో దాదాపు ఐదు ట్రలియన్ యెన్లు (సుమారు రూ.3.20లక్షల కోట్లు) జపాన్ పెట్టుబడులు పెట్టనుంది. ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిదా, ప్రధాని మధ్య జరిగిన భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. రెండు రోజుల భారత్పర్యటనలో భాగంగా 14వ భారత్- జపాన్ ద్వైపాక్షిక సదస్సులో ఫుమియో కిషిదా, మోదీ శనివారం భేటీ అయ్యారు. దిల్లీలోని హైదరాబాద్హౌస్లో ఈ సమావేశం జరిగింది. ప్రత్యేక క్లీన్ ఎనర్జీ భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేయడంతో పాటు పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు వీలుగా ఆరు ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి.
భేటీ అనంతరం ఇరు దేశాధినేతలు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్-జపాన్ బంధాలను మరింతగా బలోపేతం అవ్వడం వల్ల ఇరు దేశాలకు ప్రయోజనం చేకూరడమే కాకుండా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో కూడా దోహదపడుతుందని అన్నారు. కిషిదా మాట్లాడుతూ ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర గురించి చర్చించామన్నారు. తూర్పు ఐరోపా దేశానికి వ్యతిరేకంగా రష్యా చర్యలు అంతర్జాతీయ నిబంధనలను కాలరాసేవిగా ఉన్నాయని, ఇది తీవ్రమైన అంశంగా అభివర్ణించారు. ‘జపాన్తో ఉన్న స్నేహబంధం మరింత బలోపేతం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కిషిదా మధ్య దిల్లీలో ఉత్పాదక చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు’ అని ప్రధానమంత్రి కార్యాలయం అంతకముందు ట్విటర్ వేదికగా వెల్లడించింది.
భారత్పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3.40 గంటలకు భారత్ చేరుకున్నారు కిషిదా. దిల్లీ విమానాశ్రయంలో ఆయనకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్స్వాగతం పలికారు. ఆదివారం రాత్రి 8 గంటలకు తిరుగు ప్రయాణం కానున్నారు. భారత పర్యటన అనంతరం కంబోడియా వెళ్లనున్నారు. భారతకు వచ్చే ముందు ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై కిషిదా కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా చర్య ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి సంఘటలను ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అనుమతించబోమని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)