కొవిడ్ టెస్ట్: 90నిమిషాల్లోనే కచ్చితమైన ఫలితం!
ఎలాంటి ప్రయోగశాల అవసరం కూడా లేకుండానే డీఎన్ఏనడ్జ్(DnaNudge)పరీక్ష ద్వారా కేవలం గంటన్నరలోనే కచ్చితమైన ఫలితం వస్తున్నట్లు గుర్తించారు.
లండన్ పరిశోధకుల కొత్త విధానం
లండన్: కరోనా వైరస్ను అతి తక్కువ సమయంలోనే నిర్ధారించే పరీక్షను లండన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఎలాంటి ప్రయోగశాల అవసరం కూడా లేకుండానే డీఎన్ఏనడ్జ్(DnaNudge)పరీక్ష ద్వారా కేవలం గంటన్నరలోనే కచ్చితమైన ఫలితం వస్తున్నట్లు గుర్తించారు. తాజా పరీక్ష పరిశోధనా పత్రాన్ని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ ప్రచురించింది.
కరోనా వైరస్ విజృంభణతో ప్రపంచ దేశాలు కకావికలం అవుతోన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వైరస్ను కట్టడి చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గం..వీలైనంత త్వరగా వైరస్ సోకినవారిని గుర్తించడమే. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఆర్టీ-పీసీఆర్ విధానంలో కొవిడ్ టెస్టులు చేస్తున్నారు. దీనికి ఎక్కువ సమయం తీసుకోవడం ప్రతికూలంగా మారింది. ఇక కొన్ని ప్రాంతాల్లో త్వరగా ఫలితమిచ్చే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేస్తున్నప్పటికీ తీవ్ర లక్షణాలు ఉన్నవారిలోనే కొంతవరకు కచ్చితమైన ఫలితాలు వస్తున్నాయి.
ఇలాంటి సమయంలో డీఎన్ఏ ఆధారిత టెస్టును లండన్లోని ఇంపీరియల్ కాలేజికి చెందిన నిపుణులు రూపొందించారు. ప్రయోగాల్లో ఇది విజయవంతం కావడంతో దీన్ని వినియోగించవచ్చని అక్కడి వైద్య పరికరాల నియంత్రణ ఏజెన్సీ(ఎంహెచ్ఆర్ఏ) ఏప్రిల్ చివరిలోనే ఆమోదం తెలిపింది. కొవిడ్-19 వైరస్ సోకిన వారిని 94.4శాతం కచ్చితత్వంతో గుర్తిస్తుండగా, వైరస్ లేనివారిని వందశాతం కచ్చితత్వంతో గుర్తించ గలుగుతున్నట్లు లాన్సెట్ పేర్కొంది. ఈ పరీక్ష ద్వారా ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేకుండానే మనం ఉన్నచోటే ఫలితం పొందవచ్చని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన నిపుణులు పేర్కొన్నారు. దీని వల్ల ల్యాబ్లో వచ్చే ఫలితానికి కచ్చితంగా సరిపోలే ఫలితం వస్తున్నట్లు స్పష్టంచేశారు. ఈ విధానంలో కరోనా లక్షణాలు ఉన్న వారి ముక్కు నుంచి స్వాబ్ నమూనాను సేకరించి పరీక్షిస్తారని లాన్సెట్ నివేదికలో వివరించింది. పరీక్ష చేసేముందూ దీనికి ఎలాంటి ముందస్తు ప్రక్రియ అవసరం లేదని పేర్కొంది.
కచ్చితమైన ఫలితం ఇస్తుండడంతో అక్కడి ఆసుపత్రుల్లో ఈ పరీక్షలను ప్రారంభిస్తున్నట్లు బ్రిటన్ ఆరోగ్యశాఖ కార్యదర్శి మ్యాట్ హ్యాన్కాక్ రేడియో ద్వారా వెల్లడించారు. కేవలం చిన్న డబ్బా మాదిరిగా ఉండే ఈ పరికరానికి ఎలాంటి ప్రత్యేక ప్రయోగశాల అవసరం లేదని.. తద్వారా కొవిడ్ నిర్ధారణ చేయడం ఎంతో సులువని పేర్కొన్నారు. పాఠశాల ప్రాంగణాల్లో కూడా దీన్ని పెట్టుకునే వీలుందన్నారు. అయితే, ఈ పరికరంతో ఒకసారి ఒక టెస్టుకు సంబంధించిన సమాచారం పొందగలమని అలా, రోజుకు 16టెస్టులు మాత్రమే చేయవచ్చని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
(గ్రాఫిక్: లాన్సెట్ జర్నల్ సహకారం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ