- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
కనీస మద్దతు ధర కొనసాగుతుంది: రాజ్నాథ్
దిల్లీ: ప్రభుత్వం రైతుల పంటలకు ప్రభుత్వం తప్పకుండా కనీస మద్దతు ధర కల్పిస్తుందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భరోసా ఇచ్చారు. అదేవిధంగా మండీ వ్యవస్థ సైతం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. హిమాచల్ప్రదేశ్లో జైరాంఠాకూర్ నేతృత్వంలోని ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఆయన వర్చువల్ సమావేశంలో మాట్లాడారు. ‘రైతుల పంటలకు కనీస మద్దతు ధర తప్పకుండా ఉంటుంది. రైతుల భూముల్ని ఎవరూ తీసుకోలేరు. వ్యవసాయం గురించి తెలియని వ్యక్తులు అమాయక రైతుల్ని తప్పుదోవ పట్టించడం ఎంతో దురదృష్టకరం. భవిష్యత్తులో మండీ వ్యవస్థ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎంఎస్పీ సహా మండీ వ్యవస్థలు కొనసాగుతాయి’ అని రాజ్నాథ్ తెలిపారు.
హిమాచల్ప్రదేశ్లో అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. ‘యూపీఏ హయాంలో రాష్ట్ర అభివృద్ధికి కేవలం రూ.22వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. కానీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతకు మూడు రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చింది’ అని రాజ్నాథ్ వెల్లడించారు.
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత నెల రోజుల నుంచి దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కేంద్రంతో రైతులు పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ.. రైతుల డిమాండ్లపై కేంద్రం ఏకీభవించకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. మూడు చట్టాలను రద్దు చేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయని రైతులు చెబుతున్నారు. కాగా డిసెంబర్ 29న మరోసారి కేంద్రంతో చర్చలు జరిపేందుకు రైతు సంఘాలు అంగీకరించాయి.
ఇదీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Nitish kumar: 10లక్షలు కాదు.. 20లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: నీతీశ్
-
Sports News
Umran Malik : ఉమ్రాన్ మాలిక్ అరుదైన బౌలర్.. అయితే అలా చేయడం నాకు నచ్చదు!
-
Sports News
Sourav Ganguly: పాక్తో మ్యాచ్లను ఏనాడూ ప్రత్యేకంగా భావించలేదు: గంగూలీ
-
India News
Karnataka: సావర్కర్- టిప్పుసుల్తాన్ ఫ్లెక్సీల వివాదం.. శివమొగ్గలో తీవ్ర ఉద్రిక్తత!
-
World News
Putin: కిమ్కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
-
Politics News
Telangana News: అసహనంతో భాజపా నాయకులపై దాడులు: తెరాసపై ఈటల ఆగ్రహం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: విజయ్ దేవరకొండ రూ.2 కోట్లు వెనక్కి పంపించేశాడు: పూరీ జగన్నాథ్
- Flight: గర్ల్ఫ్రెండ్తో చాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం
- Indraja: నాకు అమ్మాయి పుట్టేదాకా.. పెళ్లి విషయం ఎవరికీ తెలియదు: ఇంద్రజ
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Tirumala: 50మంది అనుచరులకు శ్రీవారి బ్రేక్ దర్శనం.. ఏపీ మంత్రిపై విమర్శలు
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్ఛైర్లో ఝున్ఝున్వాలా డ్యాన్స్
- Jio Phone 5G: జియో 5జీ ఫోన్.. ధర, ఫీచర్లు, విడుదల తేదీ వివరాలివే!
- Ukraine Crisis: ఉక్రెయిన్లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?