కలవరపెడుతున్న మనీశ్‌ సిసోడియా ఆరోగ్యం!

దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఆరోగ్యం అందరినీ కలవరపెడుతోంది. ఇప్పటికే ఓవైపు ఆయన కరోనా వైరస్‌ బారిన పడగా.. ప్రస్తుతం డెంగీ కూడా సోకినట్లు ఆయన కార్యాలయ అధికారులు తెలిపారు. ఆయన శరీరంలో రక్తకణాల సంఖ్య తగ్గిపోయినట్లు వెల్లడించారు.

Published : 25 Sep 2020 01:05 IST

దిల్లీ: దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఆరోగ్యం కలవరపెడుతోంది. ఇప్పటికే ఓవైపు ఆయన కరోనా వైరస్‌ బారిన పడగా.. ప్రస్తుతం డెంగీ కూడా సోకినట్లు ఆయన కార్యాలయ అధికారులు తెలిపారు. ఆయన శరీరంలో రక్తకణాల సంఖ్య తగ్గిపోయినట్లు వెల్లడించారు. దీంతో ఆయనను దిల్లీలోని మాక్స్‌ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాకు ఇటీవల కరోనా వైరస్‌ సోకడంతో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆయనకు శ్వాస సంబంధ ఇబ్బందులు తలెత్తడంతో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ ఆస్పత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని