పుల్వామా దాడి.. ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు
పుల్వామా ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ, జైష్-ఏ-మొహమ్మద్ అధినేత మసూద్ అజర్ పేరును ఛార్జ్షీట్లో చేర్చింది.
దిల్లీ: పుల్వామా ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ).. ఉగ్రవాద సంస్థ జైషే అధినేత మసూద్ అజార్ పేరును ఛార్జ్షీట్లో చేర్చింది. ఫిబ్రవరి 14, 2019న చోటుచేసుకున్న ఈ ఆత్మాహుతి దాడి కేసులో ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురు కాకుండా...మసూద్ అజార్, అతడి సోదరుడు అబ్దుల్ రవూఫ్ అస్ఘర్, మరణించిన ఉగ్రవాది మొహమ్మద్ ఉమర్ ఫరూఖ్, ఆత్మాహుతి దళ సభ్యుడు అదిల్ అహ్మద్ దార్, అల్వీ, ఇస్మాయిల్ తదితర పాక్ మూలాలు కలిగిన 20 మంది పేర్లు ఛార్జ్షీట్లో ఉన్నట్టు తెలిసింది. 26/11 ముంబయి దాడులలాంటి కేసుల్లో అజార్ నిందితుడుగా ఉన్న విషయం తెలిసిందే.
భద్రతా బలగాల వాహన శ్రేణిని పేలుడుపదార్థాలు నింపిన కారుతో ఢీకొన్న నాటి ఘటనలో.. 40 మందికి పైగా భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 5000 పేజీలతో కూడిన ఛార్జ్షీట్ను నేడు జమ్ములోని ఓ ప్రత్యేక న్యాయస్థానంలో ఎన్ఐఏ దాఖలు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?