బీరుట్ పేలుళ్లు: నిర్లక్ష్యమా? రాకెట్ దాడా?
లెబనాన్ రాజధాని బీరుట్లో మూడు రోజుల క్రితం జరిగిన భీతావహ ఘటనకు కారణాలు విశ్లేషించే పనిలో అక్కడి ప్రభుత్వం........
బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్లో మూడు రోజుల క్రితం జరిగిన భీతావహ ఘటనకు కారణాలు విశ్లేషించే పనిలో అక్కడి ప్రభుత్వం నిమగ్నమైంది. ఎంతో కాలంనుంచి అధిక మొత్తంలో నిల్వ ఉన్న అమ్మోనియం నైట్రేట్ ఈ పేలుడు కారణమని ఆ దేశ ప్రధాని హసాన్ దియాబ్ స్వయంగా వెల్లడించారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం లెబనాన్ అధ్యక్షుడు మిచెల్ ఆవున్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేలుళ్ల ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా, నిర్లక్ష్యం కారణంగానా? ఇందులో బయటి వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే అనుమానాలను వ్యక్తంచేసినట్టు స్థానిక మీడియా పేర్కొంది.
‘‘అసలు కారణం ఏంటనేది ఇప్పటివరకు తెలియలేదు. బయటి వ్యక్తులు ఎవరైనా రాకెట్ లేదా బాంబుతో దాడి చేసి ఉండొచ్చు. దీనికి సంబంధించిన దర్యాప్తు మూడు దశల్లో జరుగుతుంది. ఈ ఘటనలో పేలుడు స్వభావం కలిగిన పదార్థం ఎలా లోపలికి వెళ్లిందనేది తొలి అంశం కాగా.. రెండోది పేలుడు ప్రమాదవశాత్తు జరిగిందా లేక నిర్లక్ష్యం వల్లా? అనేది. ఇక మూడోది ఇందులో బయటి వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా?’’ అనే కోణంలో విచారించబోతున్నట్లు తెలిపారు.
మూడు రోజుల క్రితం లెబనాన్ రాజధాని బీరుట్ ఓడ రేవులో నిల్వ ఉంచిన 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ పేలడంతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించాయి. ఈ ఘటనలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో గాయపడ్డారు. దాదాపు రూ.1.12 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లి ఉండవచ్చని అంచనా. పేలుడు శబ్దాలు సుమారు 200 కిలోమీటర్లు దూరం వినిపించాయంటే తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఈ ఘటనతో తీవ్రంగా నష్టపోయిన తమకు సహాయం చేయాలని ఆ దేశ ప్రధాని మిత్ర దేశాలను అభ్యర్థించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని