భారత జవాన్లకు మైక్‌ పాంపియో నివాళి

అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ వద్ద భారత అమర జవాన్లకు నివాళులర్పించారు.

Updated : 27 Oct 2020 11:40 IST

దిల్లీ: అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో, రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌లు దిల్లీలోని నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ వద్ద భారత అమర జవాన్లకు నివాళులర్పించారు. భారత్‌-అమెరికాల మధ్య అత్యంత కీలకమైన 2+2 చర్చల్లో పాల్గొనేందుకు వారు సోమవారం భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

ఈ పర్యటనలో భాగంగా వీరు భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌లతో ఈ ఉదయం భేటీ కానున్నారు. ఈ సందర్భంగా అమెరికాతో రక్షణ సంబంధాలు పటిష్ఠం చేసే అతి కీలక ‘బేసిక్‌ ఎక్స్ఛేంజీ అండ్‌ కో-ఆపరేషన్‌ అగ్రిమెంట్‌’ (బెకా)పై సంతకాలు చేసే అవకాశాలున్నాయి. అనంతరం వారు ప్రధాని నరేంద్ర మోదీతో ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీకానున్నారు.

భారత్‌, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ అత్యున్నత స్థాయి పర్యటన అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. భారత పర్యటన అనంతరం పాంపియో, ఎస్పర్‌లు శ్రీలంక, మాల్దీవులు, ఇండోనేషియాలను కూడా సందర్శించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని