టీకా నిల్వ: ఆ సమస్య ఉండదన్న మోడెర్నా!
మోడెర్నా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ భద్రపరిచేందుకు సాధారణ రిఫ్రిజిరేటర్లు (2 నుంచి 8డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత) సరిపోతాయని పేర్కొనడం ఊరట కలిగిస్తోంది.
వాషింగ్టన్: కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో తమ టీకాకు 95శాతం సమర్థత ఉన్నట్లు ప్రకటించిన మోడెర్నా సంస్థ మరో శుభవార్త చెప్పింది. తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ భద్రపరిచేందుకు సాధారణ రిఫ్రిజిరేటర్లు (2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత) సరిపోతాయని పేర్కొనడం ఊరట కలిగిస్తోంది. రిఫ్రిజిరేటర్లలోనే టీకాను 30రోజుల పాటు నిల్వఉంచడం సాధ్యమేనంటోంది. ఒకవేళ ఇదే సాధ్యమైతే టీకా పంపిణీకి కోల్డ్ స్టోరేజీ సమస్యను అధిగమించినట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు.
వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం ఎంత కీలకమో, ఆ టీకాను భద్రపరిచి వివిధ ప్రాంతాలకు సరఫరా చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ నేపథ్యంలో ఫైజర్ అభివృద్ధి చేసిన టీకా మైనస్ 70డిగ్రీల సెల్సియస్ అతిశీతల ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాల్సి రావడం అతిపెద్ద సవాల్గా మారింది. అంతేకాకుండా సాధారణ రిఫ్రిజిరేటర్లలో కేవలం ఐదురోజులు మాత్రమే నిల్వచేయవచ్చని తెలపడంతో వ్యాక్సిన్ పంపిణీ తీవ్ర చర్చనీయాంశమైంది. అతి కనిష్ఠ ఉష్ణోగ్రతలతో టీకాను మారుమూల ప్రాంతాలకు తరలించడం అతిపెద్ద సవాల్ అనే భావన అటు నిపుణులు, అధికారుల్లో వ్యక్తమైంది. ఇందుకోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందనే ఆందోళన మొదలయ్యింది. అయితే, మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్కు ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవని ప్రకటించింది. కేవలం సాధారణ రిఫ్రిజిరేటర్లతోనే దాదాపు నెలరోజుల పాటు టీకాను నిల్వ ఉంచుకోవచ్చని పేర్కొంది. అయితే, టీకా సరఫరాపై మోడెర్నా ఇప్పటివరకు అభివృద్ధి చెందిన దేశాలతోనే ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా రిఫ్రిజిరేటర్లలోనే టీకా నిల్వ చేయవచ్చని వస్తోన్న వార్తలతో అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు పేద దేశాలకు ఊరట కలుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో, ఫైజర్ కూడా టీకా నిల్వ సమస్యను పరిష్కరించే మార్గం కోసం అన్వేషిస్తోంది.
మోడెర్నాతో భారత్ సంప్రదింపులు?
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలపై సానుకూల ఫలితాలు వస్తుండడంతో భారత్ కూడా అప్రమత్తమైనట్లు సమాచారం. దాదాపు 95శాతం సమర్థత కలిగినట్లు వెల్లడించిన మోడెర్నాతో సంప్రదింపులు జరుపుతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే, మోడెర్నాతోపాటు ఫైజర్, సీరం ఇనిస్టిట్యూట్ (ఆస్ట్రాజెనెకా టీకా ప్రయోగాలు చేస్తోంది), భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా వంటి సంస్థల టీకాల ప్రయోగాలు, వాటి భద్రత, నిరోధకత, నియంత్రణ సంస్థల అనుమతులపై ఆయా కంపెనీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, మన దేశంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో పరిశోధనలు జరిపి అక్కడి నియంత్రణ సంస్థల అనుమతులు పొందే ఏదైనా టీకా లేదా ఔషధం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం(సీడీఎస్సీఓ) ప్రకారం రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ను భారత్లో చేపట్టాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాతే ఇక్కడి నియంత్రణ సంస్థల అనుమతి పొందుతాయి. అయితే, ప్రస్తుతం ఏర్పడ్డ అత్యవసర పరిస్థితుల్లో ఈ ప్రక్రియకు మినహాయింపు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా