మోడెర్నా కూడా సురక్షితమైనదే..!
మోడెర్నా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ కూడా సురక్షితంగా, సమర్థవంతంగానే పనిచేస్తున్నట్లు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ) వెల్లడించింది.
వెల్లడించిన అమెరికా ఎఫ్డీఏ
వాషింగ్టన్: మోడెర్నా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ కూడా సురక్షితంగా, సమర్థవంతంగానే పనిచేస్తున్నట్లు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ) వెల్లడించింది. కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో మోడెర్నా వ్యాక్సిన్ 94.1శాతం సమర్థత చూపించిందని.. ఇదివరకే ప్రకటించిన ఫలితాలను తాజా విశ్లేషణ ధృవీకరిస్తున్నట్లు ఎఫ్డీఏ స్పష్టంచేసింది. ప్రయోగాలకు సంబంధించి ఇదివరకు వెల్లడించిన సమాచారం కంటే తాజాగా ఎక్కువ సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం ఎఫ్డీఏ ఈ ప్రకటన చేసింది. వ్యాక్సిన్ అనుమతిపై స్వతంత్ర నిపుణుల బృందం నిర్ణయం తీసుకునే రెండు రోజుల ముందే ఎఫ్డీఏ ఈ ప్రకటన చేయడం మోడెర్నా టీకా వినియోగానికి మార్గం ఏర్పడినట్టు అర్థమవుతోంది. ఒకవేళ ఇదే జరిగితే.. మోడెర్నాను అనుమతించిన తొలిదేశంగా అమెరికా నిలుస్తుంది.
మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్ అన్నివర్గాల ప్రజలపై సమర్థవంతంగానే పనిచేస్తున్నట్లు సమాచార విశ్లేషణలో ఎఫ్డీఏ గుర్తించింది. 65ఏళ్లకు పైబడి వయసున్న వారిలో ఈ వ్యాక్సిన్ 86.4 సమర్థత చూపించగా, 18 నుంచి 65 ఏళ్లలోపు వారిలో 95.6శాతం ప్రభావవంతంగా వ్యాక్సిన్ పనిచేస్తున్నట్లు తెలిపింది.
ఇక, అమెరికాలో ఇప్పటికే ఫైజర్ తయారుచేసిన వ్యాక్సిన్కు అత్యవసర వినియోగానికి అనుమతి లభించగా మోడెర్నా టీకాపై డిసెంబర్ 17న ప్రకటన రానుంది. కమిటీ సభ్యుల్లో 17-4 ఓట్లతో ఫైజర్ వ్యాక్సిన్కు గ్రీన్ సిగ్నల్ లభించింది. కమిటీలో మొత్తం 22మంది సభ్యులుండగా ఒకరు హాజరుకాలేదు. ఫైజర్, మోడెర్నా ఈ రెండు వ్యాక్సిన్లు కూడా మెసెంజర్ ఆర్ఎన్ఏ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. అయితే, ఫైజర్ టీకాను మైనస్ 70డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేయాల్సి ఉండగా మోడెర్నాకు మాత్రం అలాంటి ఇబ్బందులేవి లేవని ఆ సంస్థ ప్రకటించింది. కేవలం సాధారణ రిఫ్రిజిరేటర్ల ఉష్ణోగ్రత వద్దే నిల్వ చేసుకోవచ్చని పేర్కొంది.
ఇవీ చదవండి..
టీకా సేకరణలో ఈ అంశాలే కీలకం
కొవిడ్ టీకా: పారదర్శకంగా లేని చైనా!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.