అయోధ్యకు చేరుకున్న ప్రముఖులు..!

అయోధ్యలో రామమందిర భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ఈ సమయంలో భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.

Updated : 05 Aug 2020 11:52 IST

అయోధ్య: అయోధ్యలో రామమందిర భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ఈ సమయంలో భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, యోగా గురువు రామ్‌దేవ్‌, స్వామి అవ్‌దేశానంద్‌ గిరి, చిదానంద్‌ మహరాజ్‌తో పాటు పలువురు ఆహ్వానితులు వేదిక వద్దకు చేరుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్‌ అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భూమిపూజకు హాజరయ్యేందుకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో దాదాపు మూడు గంటలపాటు ఉండనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని