మాస్కోలో మాస్ వ్యాక్సినేషన్ ఆరంభం
ప్రపంచంలోనే మొదటి టీకాను రిజిస్టర్ చేసి రష్యా ఆశ్చర్యపర్చగా..ఇప్పుడు ఆ దేశ రాజధాని మాస్కో మాస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది.
మాస్కో: ప్రపంచంలోనే మొదటి కరోనా టీకా నమోదు చేసిన ఆశ్చర్యపరిచిన రష్యా ఇప్పుడు ఆ దేశ రాజధాని మాస్కోలో మాస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. 70 ఆస్పత్రులను ఏర్పాటు చేసి ‘స్పుత్నిక్-వి’ టీకా డోసులను ఇస్తున్నామని అక్కడి కరోనా వైరస్ టాస్క్ఫోర్స్ అధికారులు వెల్లడించారు. వైరస్కి ఎక్కువ ప్రభావితమయ్యే వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలకు మొదట ఈ టీకా అందుబాటులో ఉంటుందన్నారు.
‘మీరు ఒక విద్యాసంస్థలో పనిచేస్తుంటే.. కొవిడ్-19 ప్రాధాన్య క్రమంలో మీరు ముందుంటారు. అది కూడా ఉచితంగా’ అంటూ ఓ పాఠశాల ఉపాధ్యాయుడికి శనివారం సందేశం వచ్చిందని అక్కడి మీడియా సంస్థ పేర్కొంది. అలాగే మొదటి ఐదు గంటల్లో ఉపాధ్యాయులు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు ఇలా సుమారు 5,000 మంది టీకా కోసం నమోదు చేసుకున్నారని శుక్రవారం ఆ నగర మేయర్ వెల్లడించారు. 60 సంవత్సరాల వయసు పరిమితిని విధించడంతో పాటు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, గర్భిణులు, రెండు వారాలుగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిని ఈ టీకా కార్యక్రమానికి దూరంగా ఉంచారు. అలాగే 21 రోజుల వ్యవధిలో రెండు డోసులుగా టీకాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. తాము రెండు కొవిడ్-19 టీకాలను అభివృద్ధి చేసినట్లు రష్యా ప్రకటించింది. స్పుత్నిక్ టీకాకు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నిధులు సమకూరుస్తుండగా.. సైబీరియాకు చెందిన వెక్టర్ ఇనిస్టిట్యూట్ మరో టీకాను అభివృద్ధి చేసింది. కానీ, ఈ రెండు టీకాలకు తుది దశ ట్రయల్స్ పూర్తి కాకపోవడం గమనార్హం. మరోవైపు రష్యాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం నాటికి దేశ రాజధాని నగరం మాస్కోలో 7,993 కొత్త కేసులు నమోదు కాగా, దేశ వ్యాప్తంగా 28,782 మంది వైరస్ బారిన పడ్డారు. 24,31,731 పాజిటివ్ కేసులతో ప్రపంచ వ్యాప్తంగా రష్యా నాలుగో స్థానంలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్