‘నీట్‌’ ఫలితాలు ఎప్పుడంటే?

వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ పరీక్ష ఫలితాలు తేదీని ఎన్‌టీఏ ఖరారు చేసింది. ఈ నెల........

Published : 12 Oct 2020 16:44 IST

దిల్లీ: వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ పరీక్ష ఫలితాల తేదీని ఎన్‌టీఏ ఖరారు చేసింది. ఈ నెల 16న ఫలితాలు వెల్లడించనున్నట్టు కేంద్ర విద్యశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ ట్విటర్‌లో ప్రకటించారు. అయితే, ఫలితాల విడుదలకు సంబంధించిన కచ్చితమైన సమయాన్ని తర్వాత తెలియబరుస్తామని ఆయన పేర్కొన్నారు.  ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో (2020-21) ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 13న జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్‌) నిర్వహించిన విషయం తెలిసిందే. కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే దేశవ్యాప్తంగా 3,862 కేంద్రాల్లో ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు. ఈ పరీక్షకు 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని