24 గంటల్లోనే.. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట
కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునే సామర్థ్యం ఒక యాంటీవైరల్ ఔషధానికి ఉన్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు.
కొత్త యాంటీవైరల్ ఔషధాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు
వాషింగ్టన్: కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునే సామర్థ్యం ఒక యాంటీవైరల్ ఔషధానికి ఉన్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మహమ్మారి ఉద్ధృతికి కళ్లెం వేయడానికి దీన్ని ఒక మార్గంగా ఉపయోగించుకోవచ్చని తేల్చారు. జార్జియా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కారం చేశారు.
మోల్నుపిరావిర్ అనే ఈ యాంటీవైరల్ ఔషధాన్ని తొలుత ఇన్ఫ్లూయెంజా వైరస్ల కోసం అభివృద్ధి చేశారు. శ్వాసకోశ వ్యవస్థలో ఇన్ఫెక్షన్లు కలిగించే ఆర్ఎన్ఏ వైరస్లపై మోల్నుపిరావిర్ సమర్థంగా పనిచేస్తుందని ఇప్పటికే రుజువైంది. ఇన్ఫెక్షన్ సోకిన జంతువులకు నోటి ద్వారా ఈ ఔషధాన్ని ఇచ్చినప్పుడు.. వాటి నుంచి బయటకు వెలువడే వైరల్ రేణువులు గణనీయంగా తగ్గుతాయని ప్రయోగాల్లో తేలింది. ఫలితంగా వైరస్ వ్యాప్తి నాటకీయంగా తగ్గిందని వెల్లడైంది. ఈ లక్షణాల కారణంగా మోల్నుపిరావిర్ను కొవిడ్ కట్టడికి అనువైన మందుగా గుర్తించారు. ప్రజలందరికీ టీకా వేసేలోగా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం చాలా కీలకం.
కొవిడ్పై ఈ ఔషధ సమర్థతను నిర్ధారించేందుకు ఫెర్రెట్ అనే జంతువులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు. వాటికి కరోనా వైరస్తో ఇన్ఫెక్షన్ కలిగించారు. వాటి ముక్కు ద్వారా వైరస్ రేణువులు బయటకు వస్తున్న దశలో కొన్ని జంతువులకు మోల్నుపిరావిర్ ఇచ్చారు. మిగతా వాటికి ఈ ఔషధాన్ని ఇవ్వలేదు. వాటిని వేర్వేరు బోనుల్లో ఉంచారు. ఆ తర్వాత ఈ రెండు బోనుల్లోకి ఆరోగ్యంగా ఉన్న ఫెర్రెట్లను ప్రవేశపెట్టారు. మోల్నుపిరావిర్ ఔషధాన్ని పొందిన జంతువులున్న బోనులోకి వెళ్లిన ఫెర్రెట్లకు వైరస్ సోకలేదు. ఆ మందును పొందని జీవులున్న బోనులోని ఫెర్రెట్లకు మాత్రం ఈ మహమ్మారి సోకింది. ఈ లెక్కన ఒక కొవిడ్ బాధితుడికి మోల్నుపిరావిర్ ఇస్తే.. 24 గంటల్లోనే అతడి నుంచి వైరస్ వ్యాప్తి ఆగిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘‘ఇది నోటి ద్వారా తీసుకునే మందు. కరోనా వ్యాప్తిని వేగంగా అడ్డుకునే సామర్థ్యమున్న ఔషధాన్ని గుర్తించడం ఇదే మొదటిసారి. ఇది విప్లవాత్మక మార్పులు తెస్తుంది’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న రిచర్డ్ ప్లెంపర్ తెలిపారు.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kota Srinivas Rao: హీరోల పారితోషికం బయటకు చెప్పటంపై కోట మండిపాటు!
-
General News
Top Ten Stories odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. పది ముఖ్యమైన కథనాలివే!
-
India News
Odisha Train Tragedy: కొన్ని క్షణాల ముందు ఏం జరిగింది?.. వెలుగులోకి ట్రాఫిక్ ఛార్ట్
-
Sports News
WTC Final: ‘ఆస్ట్రేలియా ఫేవరెట్’.. ఫలితం తారుమారు కావడానికి ఒక్క రోజు చాలు: రవిశాస్త్రి
-
India News
Mamata Banerjee: రైల్వే నా బిడ్డవంటిది.. ఈ ప్రమాదం 21వ శతాబ్దపు అతి పెద్ద ఘటన
-
India News
Odisha Train Tragedy: భారత్కు అండగా ఉన్నాం.. రైలు ప్రమాదంపై ప్రపంచ నేతలు!