కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

ఉత్తరాఖండ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ ధామీ వరద ప్రభావం నుంచి తృటిలో తప్పించుకున్నారు...

Published : 31 Jul 2020 12:32 IST

ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ ధామీ వరద ప్రభావం నుంచి తృటిలో తప్పించుకున్నారు. పితోర్‌ఘడ్‌ జిల్లా ధారుచులా ప్రాంతంలో అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో కాలువను దాటేందుకు ఎమ్మెల్యే హరీశ్‌ ప్రయత్నించారు. ఈ క్రమంలో కాలువ చివరికి చేరే సరికి వరద ఉద్ధృతి మరింత పెరిగింది. దీంతో ఎమ్మెల్యే పట్టుతప్పి కాలువలో జారి పడిపోయారు. వరద నీటిలో కొట్టుకుపోతున్న ఆయన్ని అక్కడే ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలు రక్షించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని