నివర్ అలెర్ట్: 30 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం!
‘నివర్’ అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు 22 బృందాలను సిద్ధంగా ఉంచింది. ఈ మేరకు ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్, వాతావరణ శాఖ డీజీ మృత్యుంజయ .........
దిల్లీ: ‘నివర్’ అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు 22 బృందాలను సిద్ధంగా ఉంచింది. ఈ మేరకు ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్, వాతావరణ శాఖ డీజీ మృత్యుంజయ మహాపాత్ర సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. తుపాను గమనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు ఎన్డీఆర్ఎఫ్ డీజీ వెల్లడించారు. దీని ప్రభావం ఉండే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. భారత వాతావరణ శాఖ సూచనలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అవసరాలను బట్టి మొత్తం 22 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించినట్టు వెల్లడించారు. వీటిలో 12 బృందాలు తమిళనాడు, మూడు బృందాలు పుదుచ్చేరి, ఏడు బృందాలను ఏపీలో ఇప్పటికే మోహరించామన్నారు. అదనపు అవసరాల కోసం మరో 8 బృందాలను అప్రమత్తం చేసినట్టు తెలిపారు. మొత్తంగా 30 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశామన్నారు. ఈ బృందాల వద్ద సహాయక చర్యలకు అవసరమైన పరికరాలన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా నేపథ్యంలో పీపీఈ కిట్లు కూడా ఉన్నట్టు చెప్పారు.
జనానికి ఎన్డీఆర్ఎఫ్ భరోసా
తుపాను ప్రభావం ఉంటుందని భావిస్తున్న అన్ని జిల్లాలు, స్థానిక అధికారులతో ఎన్డీఆర్ఎఫ్ చాలా దగ్గరగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తోందని సంబంధిత డీజీ ఎస్ఎన్ ప్రధాని వెల్లడించారు. తుపానులకు సంబంధించిన సమాచారంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్నీ వివరిస్తున్నామన్నారు. అలాగే, ఆయా ప్రాంతాల నుంచి జనాన్ని తరలించేందుకు స్థానిక అధికారులకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహకరిస్తున్నారన్నారు. సమాజంలో భద్రతాభావాన్ని వ్యాప్తి చేస్తోందని, పరిస్థితులు సాధారణ స్థితికి చేరేదాకా ఈ బృందాలు తమకు అందుబాటులో ఉంటాయన్న భరోసాను కల్పిస్తున్నాయన్నారు.
తమిళనాడులో రేపు సెలవు: సీఎం పళని
నివర్ తుపాను ప్రభావంతో చెన్నైలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రేపు తీరం దాటనున్న నేపథ్యంలో పలు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ డీజీ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఈ తీవ్రత మరీ అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న నివర్ తుపాను ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయం దిశగా 380 కి.మీలు, చెన్నైకి ఆగ్నేయ దిశగా 480 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉందని వివరించారు. మరో 12గంటల్లో ఇది అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు చెప్పారు. బుధవారం సాయంత్రం పుదుచ్చేరి సమీపంలోని కరైకల్ - మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీవ్ర తుపాను నివర్ తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కి.మీల వేగంతో ప్రచండగాలులు వీచే అవకాశం ఉన్నట్టు ఆయన హెచ్చరించారు. బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తమిళనాడు సీఎం పళనిస్వామి రేపు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి