జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది.  దేశ వ్యాప్తంగా 47 మందిని జాతీయ ఉత్తమ........

Published : 21 Aug 2020 23:22 IST

దిల్లీ: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 47 మందిని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు చోటు దక్కించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడు మధుబాబు, హైదరాబాద్‌లోని మలక్‌పేట పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మప్రియ ఈ ఉత్తమ పురస్కారాలను అందుకోనున్నారు. అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 153మందిని షార్ట్‌లిస్ట్‌ చేసిన జ్యూరీ..  చివరకు 47మందిని జాతీయ అవార్డులకు ఎంపిక చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని