నేపాల్ పార్లమెంట్ రద్దుకు ప్రధాని సిఫారసు!
నేపాల్ పార్లమెంటును రద్దు చేయాలంటూ ఆ దేశ ప్రధాని కె.పి.శర్మ ఓలీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి మండలి అధ్యక్షుడికి సిఫారసు చేసింది. ఆదివారం ఉదయం అత్యవసరంగా భేటీ అయిన మంత్రి మండలి ఈ...........
కాఠ్మండూ: నేపాల్ పార్లమెంటును రద్దు చేయాలంటూ ఆ దేశ ప్రధాని కె.పి.శర్మ ఓలీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి మండలి అధ్యక్షురాలు విద్యాదేవీ భండారీకి సిఫారసు చేసింది. ఆదివారం ఉదయం అత్యవసరంగా భేటీ అయిన మంత్రి మండలి ఈ మేరకు అనూహ్య నిర్ణయం తీసుకుంది. అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(ఎన్సీపీ)లో కొంతకాలంగా తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయి ప్రధాని పీఠం కోసం ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తాజా ఘటనతో అవి మరింత తారస్థాయికి చేరుకున్నట్లైంది.
రెండు వర్గాల్లో ఒకటి ఓలీ నేతృత్వంలోనిది కాగా.. మరొకటి మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ ఆధ్వర్యంలోనిది. ప్రస్తుతం మనుగడలో ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు 2017లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 275 మంది సభ్యులు ఉన్నారు. మంత్రి మండలి నిర్ణయాన్ని అధికార ఎన్సీపీలోని సీనియర్ నేత, మాజీ ప్రధాని మాదవ్ కుమాన్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రచండ వర్గానికి చెందిన ఈయన మాట్లాడుతూ సమావేశం రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందన్నారు. ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలంటూ ప్రచండ వర్గం గత కొన్ని రోజుల నుంచి ఓలీని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
తనను పదవి నుంచి దించడానికి భారత్, నేపాల్లలో కుట్రలు జరుగుతున్నాయని నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలీ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. ఒకప్పుడు భారత్కు ఎంతో స్నేహశీలిగా ఉన్న ఓలీ భారత్పై అలా ఆరోపణలు గుప్పించడం తీవ్ర చర్చకు దారితీసింది. జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తిస్తూ భారతదేశం విడుదల చేసిన రాజకీయ పటాలపైనా ఓలీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. సుదీర్ఘకాలంగా భారత భూభాగంలో కొనసాగుతున్న కాలాపానీ, లింపియాదురా ప్రాంతాలు తమ భూభాగంలోనివని వాదించింది. ఉత్తరాఖండ్ నుండి లిపులేఖ్ పాస్ వరకు నిర్మించిన ఓ రహదారిపైనా నేపాల్ అనుచిత వ్యాఖ్యలు చేసింది. వీటన్నింటినీ భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది.
ఓలీ తీరుపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమైంది. ఎన్సీపీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఆయన తీరును తీవ్రంగా తప్పుబట్టింది. అప్పటి నుంచి ఓలీ రాజీనామా డిమాండ్ ఊపందుకుంది. ఆర్థికంగా కూడా దేశాన్ని సరైన మార్గంలో నడిపించలేకపోయారని ఆయనపై విమర్శలున్నాయి. కొవిడ్ను ఎదుర్కోవడంలోనూ విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు చైనాకు చేరువయ్యేందుకే ఓలీ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఆ మధ్య నేపాల్లోని చైనా రాయబారితో ఓలీ పలుసార్లు భేటీ కావడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో ఓలీ చైనాకు అంటకాగే విషయంలో వెనక్కి తగ్గినట్లు విశ్లేషణలు వెలువడ్డాయి.
ఇవీ చదవండి..
దిల్లీ గురుద్వారాకు ప్రధాని ఆకస్మిక సందర్శన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం