తొలి టీకా నేనే తీసుకుంటా: ఇజ్రాయెల్‌ ప్రధాని

కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్‌పై ప్రజల్లో విశ్వాసం కలిగిచేందుకు తొలి టీకా తానే తీసుకుంటానని అంటున్నారు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ. ఫైజర్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి విడత టీకాలను

Updated : 09 Dec 2020 19:46 IST

టెల్‌ అవివ్‌: కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్‌పై ప్రజల్లో విశ్వాసం కలిగిచేందుకు తొలి టీకా తానే తీసుకుంటానని అంటున్నారు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ. ఫైజర్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి విడత టీకాలను ఇజ్రాయెల్‌ నేడు అందుకుంది. టెల్‌ అవివ్‌ సమీపంలోని ఎయిర్‌పోర్టులో ప్రత్యేక విమానంలో చేరుకున్న టీకాలను నెతన్యాహూ స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మహమ్మారి ముగింపు కనుచూపు మేరలో కన్పిస్తోంది. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందించడమే నా ప్రథమ ప్రాధాన్యం. టీకా విషయంలో ప్రజలకు నేను ఉదాహరణలా నిలవాలనుకుంటున్నా. అందుకే దేశంలో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభంకాగానే తొలి టీకా నేను తీసుకోవాలనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు. 

ఇజ్రాయెల్‌లో ఫైజర్‌ వ్యాక్సిన్‌ వినియోగానికి ఇంకా అక్కడి రెగ్యులేటరీలు అనుమతించలేదు. అతి త్వరలోనే ఈ అనుమతులు మంజూరు అవుతాయని నెతన్యాహూ విశ్వాసంగా ఉన్నారు. టీకా కోసం ఇప్పటికే ఫైజర్‌ సంస్థతో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ నుంచి 80లక్షల డోసులకు ఆర్డర్‌ చేసింది. తొలి విడతలో భాగంగా లక్ష డోసులు నేడు ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. దీంతో పాటు మరో అమెరికా బయోటెక్‌ సంస్థ మోడెర్నా నుంచి ఆరు లక్షల డోసుల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. వచ్చే ఏడాది ఆ డోసులు డెలివరీ కానున్నాయి. ఇజ్రాయెల్‌లో 3లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. బుధవారం నాటికి అక్కడ 2,932 మంది వైరస్‌కు బలయ్యారు.

జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌తో కలిసి ఫైజర్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ఇప్పటికే బ్రిటన్‌ అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి అక్కడ టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 90ఏళ్ల మార్గెరెట్‌ కీనన్‌ తొలి టీకా తీసుకున్నారు. అమెరికాలో త్వరలోనే ఫైజర్‌కు అనుమతులు లభించనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి..

టీకా మా తర్వాతే ఎవరికైనా: ట్రంప్‌

బ్రిటన్‌లో 90ఏళ్ల మహిళకు తొలి టీకా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని