భారత్లో కరోనా.. 35 రోజులుగా అదే ట్రెండ్!
దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. గత కొంతకాలంగా కేసుల్లో తగ్గుదల కనిపించినప్పటికీ తాజాగా మరో 50,357 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కోరల్లోంచి బయటపడి కోలుకున్నవారి సంఖ్య అధికంగా ఉండటం ...........
కొత్త కేసుల కన్నా కోలుకున్నవారే అధికం
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. గత కొంతకాలంగా కేసుల్లో తగ్గుదల కనిపించినప్పటికీ తాజాగా మరో 50,357 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కోరల్లోంచి బయటపడి కోలుకున్నవారి సంఖ్య అధికంగా ఉండటం సానుకూలాంశంగా ఉంది. గత 24గంటల్లో 50,356 కొత్త కేసులు రాగా.. 53,920 మంది కోలుకొని డిశ్ఛార్జి కావడం గమనార్హం. దాదాపు గత ఐదు వారాలుగా దేశంలో ఇదే ట్రెండ్ కొనసాగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో భారత్లో క్రియాశీల కేసుల్లో (యాక్టివ్ కేసులు) తగ్గుదల కనబడుతున్నట్టు పేర్కొంది. అక్టోబర్ తొలి వారం నాటికి దేశంలో సగటున 73వేల కేసులు ఉన్నప్పటికీ ఆ సంఖ్య 46వేలకు తగ్గుతూ వచ్చింది. కానీ శుక్రవారం మళ్లీ కేసులు పెరగడంతో దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 5,16,632కి చేరింది.
ఆ 18చోట్లే రికవరీ రేటు అధికం!
గడిచిన 24గంటల్లో వైరస్ నుంచి కోలుకున్నవారిలో 79శాతం మంది 10 రాష్ట్రాల్లోనే ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో అత్యధికంగా 11,060 మంది కోలుకోవడంతో అక్కడ ఇప్పటిదాకా రికవరీ అయినవారి సంఖ్య 15,62,342కి చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ (7854), దిల్లీ (6121) ఉన్నాయి. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 92.41%గా ఉండగా.. 18 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కన్నా అధికంగా రికవరీ రేటు ఉండటం విశేషం.
కొత్త కేసుల కలకలం ఈ మూడుచోట్లే..!
దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో దిల్లీ, కేరళ, మహారాష్ట్రలలోనే అధికం. గతంలో దిల్లీ, కేరళలో కేసుల సంఖ్య చాలా పరిమితంగానే ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో రికార్డు స్థాయిలో వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దిల్లీలో నిన్న 7178 కొత్త కేసులు రాగా.. కేరళలో 7002, మహారాష్ట్రలో 6870 చొప్పున వచ్చాయి. నిన్న ఒక్కరోజు నమోదైన మొత్తం కేసుల్లో 77శాతం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అలాగే, నిన్న 577 మంది కొవిడ్తో ప్రాణాలు కోల్పోగా.. మహారాష్ట్ర, దిల్లీ, పశ్చిమ బెంగాల్లో అధికంగా నమోదైనట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
గత 24గంటల్లో నమోదైన మరణాల్లో (577) 83శాతం మంది కేవలం 10 రాష్ట్రాల నుంచే ఉండటం అక్కడి తీవ్రతకు నిదర్శనం. కొత్తగా మహారాష్ట్రలో అత్యధికంగా 161మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ తర్వాత దిల్లీలో 64మంది, బెంగాల్లో 55 మందిచొప్పున మృతి చెందారు.
దేశంలో కరోనా పరిస్థితి ఇలా..
భారత్లో ఇప్పటివరకు 84,62,080 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 78,19,886 (92.41%) కోలుకోగా 1,25,562 (1.48%) ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 5,16,632 (6.11%) క్రియాశీల కేసులు ఉన్నాయి. మరోవైపు, దేశంలో కరోనా టెస్ట్ల సంఖ్య పెంచుతున్నారు. నవంబర్ 6న 11,13,209 శాంపిల్స్ను పరీక్షించగా.. దేశంలోకి కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటిదాకా 11,65,42,304 శాంపిల్స్ టెస్ట్లు చేసినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ వ్యూహంతో వైరస్ కట్టడికి రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)