సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ఇప్పుడే కాదు!

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షల నిర్వహణ ఉండదని వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ వెల్లడించారు.

Published : 22 Dec 2020 17:40 IST

దిల్లీ: సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షల నిర్వహణ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి మాసాల్లో ఉండదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ వెల్లడించారు. ఈమేరకు ఆయన మంగళవారం ఉపాధ్యాయులతో నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో పేర్కొన్నారు. ‘సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షల నిర్వహణ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఉండదు. కొంత కాలం తర్వాత పరీక్షల నిర్వహణ జరుగుతుంది’ అని పోఖ్రియాల్‌ తెలిపారు. కానీ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రత్యేకమైన తేదీలను వెల్లడించలేదు.

ఇదీ చదవండి

దారుణ యాప్‌ల వ్యవహారంలో ఆరుగురి అరెస్టు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని