ట్రంప్ను గద్దె దించాల్సిందే: ఒబామా
అమెరికా అధ్యక్షపదవి నుంచి డొనాల్డ్ ట్రంప్ను ఎట్టిపరిస్థితుల్లోనైనా దింపాల్సిన అవసరముందని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పునరుద్ఘాటించారు. కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఆయన చర్యల వల్ల ఎంతో మంది అమెరికా పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో గత పరిస్థితులు తిరిగి రావాలంటే డెమెక్రాటిక్...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షపదవి నుంచి డొనాల్డ్ ట్రంప్ను ఎట్టిపరిస్థితుల్లో దింపాల్సిందేనని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఆయన చర్యల వల్ల ఎంతో మంది అమెరికా పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో గత పరిస్థితులు తిరిగి రావాలంటే డెమొక్రాటిక్ అభ్యర్థి బైడెన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారాలు హోరా హోరీగా సాగుతున్నాయి. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి బైడన్, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్కు మద్దతుగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిలడెల్ఫియాలో నిర్వహించిన ర్యాలీలో ఒబామా ప్రసంగించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కదిద్దాలి?కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలన్న దానిపై బైడన్, కమలా హారిస్లకు నిర్దిష్ట ప్రణాళికలు ఉన్నాయన్నారు. వారిద్దరూ అమెరికా ప్రభుత్వానికి పూర్వ వైభవం తీసుకొస్తారని తెలిపారు. ట్రంప్ చేపట్టిన ఆర్థిక చర్యలు మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ను పోలి ఉన్నాయని చెబుతూ.. అప్పట్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనట్లుగానే ఇప్పుడు కూడా ప్రతికూల ప్రభావం చూపించిందని వ్యాఖ్యానించారు.
కరోనా నిబంధనలను కనీసం కూడా పాటించడం లేదని ఒబామా మండిపడ్డారు. ఇటు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా అధికార దాహంతో తన ప్రచార కార్యక్రమాల్లో ఇసుమంతైనా మార్పు చేయరని విమర్శించారు. ‘‘ఆయన ప్రజలకు దూరంగా స్టేజ్పైన ఉంటూ ప్రసంగిస్తారు. అంతకుమందు సిబ్బంది ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేస్తారు. కనీసం మాస్కు ధరించకుండానే మాట్లాడుతారు. ప్రసంగం పూర్తయిన తర్వాత మాత్రం ‘ఓట్ మాస్క్’ ధరించి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోతారు. అక్కడికి వచ్చిన ప్రజలను దృష్టిలో ఉంచుకోరు’’ అని ఒబామా విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం వల్ల ప్రజాసమస్యలు తీరిపోవని ఎద్దేవా చేశారు.
చైనా బ్యాంకులో అకౌంట్
తాజాగా వెల్లడైన వివరాల మేరకు ట్రంప్నకు చైనా బ్యాంకులో ఖాతా ఉందని ఒబామా అన్నారు. రహస్యంగా లావాదేవీలు జరుపుతున్నారని ఆరోపించారు. ఆయనకు అదెలా సాధ్యమైందని ప్రశ్నించారు. అసలు రహస్యంగా ఖాతాను తెరవాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఒకవేళ నాకే చైనాలో బ్యాంక్ అకౌంట్ ఉంటే రెండోసారి అధ్యక్షుడిగా అవకాశమిచ్చేవాళ్లా? అని ప్రజలను ప్రశ్నించారు. అధ్యక్షుడు ట్రంప్ అమెరికాను రక్షణకు కృషి చేయడం లేదని, తనను తాను రక్షించుకోవడానికి మాత్రమే చూస్తున్నారని ఆరోపించారు. అంతర్జాతీయ ఉగ్రవాది బిన్ లాడెన్ను అమెరికా నేవీ హతమార్చలేదని ట్రంప్ చెప్పడం వెనక ఆంతర్యమేమిటని ఒబామా మండిపడ్డారు. తాజా ఎన్నికలు ఎంతో కీలకమైనవిగా పేర్కొంటూ.. అమెరికా ప్రజలు 2016లో చేసిన తప్పును పునరావృతం చేయరని ఆశిస్తున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా