ఒడిశా గవర్నర్‌కు కరోనా

ఒడిశా రాష్ట్ర గవర్నర్‌ గణేశీ లాల్‌, ఆయన సతీమణికి కొవిడ్‌-19 సోకింది.

Published : 02 Nov 2020 17:33 IST

సతీమణి, ఇతర కుటుంబ సభ్యులకు కూడా..

భువనేశ్వర్‌: ఒడిశా రాష్ట్ర గవర్నర్‌ గణేశీలాల్‌, ఆయన సతీమణికి కొవిడ్‌-19 సోకింది. ఈ విషయాన్ని గవర్నర్‌ సిబ్బంది సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. గవర్నర్‌, ఆయన అర్ధాంగి సుశీలా దేవికే కాకుండా వారి కుటుంబంలో మరో ఐదుగురికి కూడా కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా ఇటీవల తమ సమీపంలోకి వచ్చిన వారందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ నేపథ్యంలో గవర్నర్‌ సూచించారు. గవర్నర్‌తో సహా వారందరినీ చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని