‘ఆయన అనారోగ్యానికి టీకాతో సంబంధం లేదు’
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకాతో కలిసి తాము రూపొందించిన కరోనా టీకా ‘కొవిషీల్డ్’ సురక్షితమైనదని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) స్పష్టం చేసింది. వైరస్ను ఎదుర్కోవడంలో సమర్థంగా పనిచేస్తుందని వెల్లడించింది...........
కొవిషీల్డ్ వ్యాక్సిన్ సురక్షితమని స్పష్టం చేసిన సీరం
దిల్లీ: ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకాతో కలిసి తాము రూపొందించిన కరోనా టీకా ‘కొవిషీల్డ్’ సురక్షితమైనదని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) స్పష్టం చేసింది. వైరస్ను ఎదుర్కోవడంలో సమర్థంగా పనిచేస్తుందని వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొన్న ఓ వాలంటీరులో తలెత్తిన అనారోగ్యానికి టీకాతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
‘‘కొవిషీల్డ్ వ్యాక్సిన్ సురక్షితమైంది. వైరస్ను సమర్థంగా ఎదుర్కొంటుంది. చెన్నైకు చెందిన వాలంటీరులో అనారోగ్య సమస్యలు రావడం దురదృష్టకరం. కానీ ఆయన అనారోగ్యానికి టీకాతో ఎలాంటి సంబంధం లేదు. వ్యాక్సిన్ ప్రయోగాలల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. తాజా సంఘటనకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులు, పరిశోధకులకు తెలియజేశాం. వారు కూడా ఆయన అనారోగ్యానికి టీకాతో ఎలాంటి సంబంధం లేదని ధ్రువీకరించారు’’ అని సీరం ఇన్స్టిట్యూట్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. డీసీజీఐకి కూడా వివరాలను అందజేసినట్లు తెలిపింది.
టీకా సురక్షితమైంది కాకపోయినా.. కరోనాపై ప్రభావం చూపకపోయినా.. వ్యాక్సిన్ను ప్రజా వినియోగానికి అందుబాటులోకి తీసుకురాబోమని సీరం ఇన్స్టిట్యూట్ స్పష్టం చేసింది. కంపెనీపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని తెలిపింది. సంస్థ ప్రతిష్ఠను దిగజార్చి ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయోద్దని కోరింది. దురుద్దేశంతో వాలంటీరు అసత్య ప్రచారాలు చేసినందుకే రూ.100 కోట్లు దావా వేస్తామని తెలిపినట్లు పేర్కొంది.
‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ వల్ల తన ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడిందని క్లినికల్ ప్రయోగాల్లో పాల్గొన్న ఓ వాలంటీరు ఆరోపించిన విషయం తెలిసిందే. టీకా తీసుకున్న తర్వాత వాలంటీరులో మెదడు సంబంధిత సమస్యలు తలెత్తాయని ఓ బిజినెస్ కన్సల్టెంట్ ద్వారా సీరం ఇన్స్టిట్యూట్, ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్కు నోటీసులు పంపారు. ఈ ఆరోపణల్ని సీరం వెంటనే ఖండించింది.
ఇదీ చదవండి..
కొవిషీల్డ్ టీకాపై దుమారం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం